Monday 31 December 2018

రైతుకు చేయూత

                                           నూతన సంవత్సరం వచ్చిందంటే అందరూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియచేసుకోవడంతోపాటు పెద్దలను కలిసేటప్పుడు ఎక్కువగా మిఠాయిలు,ఆపిల్ పండ్లు తీసుకెళ్లటం ఆనవాయితీగా వస్తుంది.మిఠాయిలు ఆరోగ్యానికి చేటు.ఆపిల్ పండ్లు విదేశీ పండ్లు.వీటిని దిగుమతి చేసుకోవడంతో డబ్బు విదేశాలకు చేరుతుంది.కనుక వీలైనంతవరకు ఈసారి మనదేశంలో,మన రైతులు పండించిన అరటి,చక్రకేళి,దానిమ్మ,బొప్పాయి,జామ వంటి రకరకాల పండ్లు శుభాకాంక్షల నిమిత్తం ఉపయోగించినట్లయితే మన రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.స్వదేశీ పండ్లను ఉపయోగించి రైతులకు చేయూత ఇచ్చినట్లయితే వ్యవసాయ కుటుంబాలు ఆర్ధికంగా మెరుగుపడడానికి సహాయపడినట్లు అవుతుంది.మిఠాయిలు,విదేశీ పండ్ల కన్నా స్వదేశీ పండ్లే ముద్దు.

No comments:

Post a Comment