బార్లీ వలన అనేక ఉపయోగాలున్నా కూడా దీనిని వాడడానికి అందరూ ఇష్టపడరు. బార్లీ గింజలు ఉడికించి వడకట్టి ఆ నీటిని త్రాగడం వలన శరీర వేడి తగ్గి చలువ చేస్తుంది అని ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయని అమ్మ చెప్పింది..మూత్రపిండాలు,మూత్రనాళ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.బార్లీ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె పనితీరు మెరుగుపడుతుంది. పీచు పదార్ధం ఎక్కువగా ఉండడంతో మలబద్ధకం రానివ్వదు. గర్భిణీ స్త్రీలకు కాళ్ళు వాపులు రాకుండా ఉంటాయి. రక్తంలో చక్కర స్థాయిల్ని నియంత్రిస్తుంది.బరువు తగ్గాలనుకకునేవారు సైతం బార్లీ ఏదో ఒక రూపంలో వాడితే కడుపు నిండిన భావన కలిగి బరువు తగ్గుతారు.చర్మానికి తేమను అందించి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. బార్లీ నీళ్లతో ముఖం కడిగితే మొటిమలు,మచ్చలు పోతాయి. బార్లీ గింజలు ఉడికించి నీళ్లు త్రాగి ఆ గింజలతో ఉప్మా, కిచిడీచేసుకోవచ్చు. ఉడికిన గింజలు మిక్సీలో వేసి కొద్దిగా బియ్యప్పిండి,ఉల్లి, పచ్చిమిర్చి,అల్లం, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి అన్నీ కలిపి వడలు వేస్తే చాలా రుచిగా ఉంటాయి. అమ్మ బార్లీ వడలు వేస్తుంది.పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు.ఇంకెందుకు ఆలస్యం బార్లీని ఆహారంలో భాగం చేసుకుని ఆరోగ్యం స్వంతం చేసుకుందాము.
తెలుగు వారి బ్లాగ్
Monday, 4 May 2026
Sunday, 3 May 2026
కంటి సమస్యలకు జేజి చిట్కా
ఈ రోజుల్లో కంటి సమస్యలు పిల్లల నుండి పెద్దల వరకు సర్వ సాధారణము అయిపోయింది.దీన్ని అధిగమించడానికి జేజి ఒక చిట్కా చెప్పింది. అది ఏమిటంటే చెట్టునుండి మునగాకు కోసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి.కొద్దిగా ఎండిన తర్వాత వేయించి పొడి చేసుకోవాలి. ఒక 90 గ్రా. పొడికి 10 గ్రా. వేయించిన కరక్కాయ పొడి కలుపుకుని ఒక సీసాలో భద్రపరచుకోవాలి. రోజూ ఒక 1/4 చెంచా పొడి,ఒక కప్పు పాలల్లో తాటి బెల్లం కలిపి త్రాగాలి. క్రమంగా కంటి సమస్యలు తొలగిపోతాయి.దీనితోపాటు పొన్నగంటి ఆకుకూర తినండి. కంటి చూపు మెరుగు పడుతుంది.
Saturday, 2 May 2026
నవ్వుతూ బ్రతకాలి
ఒకప్పుడు నవ్వు నాలుగు విధాల చేటు అని బిగ్గరగా నవ్వితే పిల్లల్ని కోప్పడేవాళ్ళు పెద్దవాళ్ళు.ఇప్పుడు నవ్వు నవ్వించు అని చెప్పడం అలవాటు చేసుకున్నారు.ఈమధ్య నవ్వడమే మర్చిపోతున్నాము.నవ్వడం వలన మనస్సు తేలికగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.నవ్వడం వలన మనలో సానుకూలత పెరుగుతుంది. నవ్వుకి భాషతో సంబంధం లేదు.ఒక చిరునవ్వుతో ఎదుటివారిని పలకరించవచ్చు.నవ్వుతూ బ్రతకాలిరా అని సినీ రచయిత అన్నట్లు బ్రతికినన్నాళ్ళు నవ్వుతూ హాయిగా, ఆనందంగా బ్రతకాలి. ఎన్ని సమస్యలున్నా ముఖంపై నవ్వు చెదరనీయకూడదు.జీవితం అంటే పరుగు కాదు.జీవితం అంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండడం.నవ్వు నలుగురిని నవ్వించు.ఈ రోజుల్లో ఎంత ఆస్తి ఉన్నదనో, ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నదనో కాదు లెక్క ఎంత ఆనందంగా ఉన్నామనేదే లెక్క.చనిపోయేటప్పుడు కూడా నవ్వుతూ చనిపోయేవాళ్ళు అదృష్టవంతులు.అలాగే సానుకూలంగా ధృక్పదంతో ఉంటే తప్పకుండా సాధ్యపడుతుంది.ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఒక్కరోజే కాదు ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండండి.అందరికీ ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు.
బియ్యం లేకుండా దోశ
ఉలవలు - 1 కప్పు
ఏదైనా ఒక చిరు ధాన్యం - 1 కప్పు
మినపగుళ్ళు - 1/2 కప్పు
మెంతులు - 1చిన్న చెంచా
వీటన్నింటిని శుభ్రంగా కడిగి విడివిడిగా 8 గం. నానబెట్టి మెత్తగా పిండి రుబ్బాలి. అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది.5,6 గం.నానబెట్టి వేసుకుంటే మెత్తగా ఉంటాయి.మనకు ఏ రకంగా నచ్చితే ఆలా వేసుకోవచ్చు.ఈ పిండిలో మనకు నచ్చిన ఆకుకూర సన్నగా తరిగి వేసుకోవచ్చు.కొద్దిగా సన్నగా తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కారట్ తురుము దోశపై వేసుకుంటే బాగుంటుంది.టమాటో, చట్నీ లేదా వేరుశెనగ చట్నీ, అల్లం పచ్చడి ఏదైనా వేసుకోవచ్చు. దోశ చాలా బాగుంటుంది.
నిద్రలేమి,ఒత్తిడికి అమ్మ చిట్కా
ఈ రోజుల్లో నిద్ర పట్టకపోవడం అన్నది సర్వసాధారణమై పోయింది. రోజూ 6 నుండి 8 గంటలు నిద్ర పట్టినట్లయితే ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది.దీనితోపాటు కొద్దిపాటి వ్యాయామం, అదే పనిగా ఒకేచోట కూర్చోకుండా మధ్యమధ్యలో నడుస్తున్నట్లయితే ఆరోగ్యం బాగుండడంతోపాటు మతిమరుపు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈమధ్య జరిపిన అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.అందుకోసం అమ్మ ఒక చిట్కా చెప్పింది అదేంటంటే సోంపు -50 గ్రా., మిరియాలు - 5 గ్రా., జాజికాయ - 2 1/2 గ్రా., యాలకులు - 10 గ్రా., బాదాంపప్పు 40 గ్రా., గసగసాలు - 30 గ్రా., పటికబెల్లం 20 గ్రా., బాగా ఎండబెట్టి పొడి చేసుకుని ఉ, సా. భోజనం తర్వాత 1 చెంచా చొప్పున నీళ్లతో కానీ పాలతో కానీ తీసుకోవాలి. ఈ విధంగా ఒక 20 రోజులు చేస్తే మంచి నిద్ర పట్టి ఒత్తిడి దరిచేరదు.మంచి అలవాట్లు చేసుకుంటే మన ఆరోగ్యంతోపాటు మన కుటుంబం కూడా బాగుంటుంది.
Thursday, 23 April 2026
పుస్తకం
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకం గురించి వ్రాయాలని అనిపించింది.పుస్తకం ఒక స్నేహితురాలు లేకపోతే స్నేహితుడు.కొంతమంది స్నేహితులతో అయినా మాట్లాడకుండా ఉండగలరేమో కానీ పుస్తకం చదవకుండా ఉండలేరు.నేను కూడా అంతే.బహుశా ఆ అలవాటు మా తాతగారి నుండి వచ్చింది. ఆయన ఒక పుస్తకం చదవడం మొదలు పెడితే అది అయిపోయేవరకు చుట్టుప్రక్కల ఏమీ జరుగుతుందో పట్టించుకోనంతగా పుస్తక పఠనంలో లీనమైపోయేవారు. ఇ - పుస్తకాలు రావడంతో ఈ రోజుల్లో పుస్తకాలు చదివేవాళ్ళు తగ్గినా కూడా పుస్తక ప్రియులు ఉండబట్టే పుస్తక మహోత్సవాలు కళకళలాడుతున్నాయి.రోజు ఒకే పుస్తకం చదివినా ఒక్కోరోజు ఒక్కొక్క రకంగా అర్థం స్పురిస్తుంది. రోజూ పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.మన ఆలోచనల్లో మార్పుతోపాటు జ్ఞానం వస్తుంది. ఈరోజు నుండి పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి.రోజులో కొద్దిసేపైనా చదవడానికి ప్రయత్నించండి.
Monday, 20 April 2026
ఆరోగ్యానికి ఆరోప్రాణం
ఆరోగ్యానికి ఆరోప్రాణం పీచు పదార్ధం. మనము ఇంటిని శుభ్రం చేసుకున్నట్లగానే మన ఒంటిని శుభ్రం చేసే పోషక పదార్ధమే పీచు పదార్ధం. ప్రేగుల్ని, రక్తనాళాల్ని శుభ్రం చేస్తూ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థపదార్ధాల్ని ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఇదే కాకుండా మలబద్ధకం, క్యాన్సర్ వంటి జబ్బులు దరి చేరనివ్వదు. పీచు పదార్ధం తగినంత అందాలంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు,తృణధాన్యాలు,ఓట్స్,బీన్స్,కందిపప్పు, చిక్కుడు గింజలు, శనగలు మొదలైన వాటిల్లో ఎక్కువగా ఉంటుంది.నిమ్మజాతి పండ్లలో పీచు ఎక్కువగా ఉంటుంది. అవిసె గింజలు,బార్లీ,గోధుమలు, జొన్నలు, రాగులు, మొక్కజొన్న, దోసకాయలు, చిలకడ దుంపల్లో ఉంటుంది. బాదం, వాల్నట్లు, పొద్దుతిరుగుడు, చియా గింజల్లో పీచు ఎక్కువగా ఉంటుంది.రోజు పండ్లు, కూరగాయలు, గింజలు అన్నీ సమంగా ఉంటే పీచు బాగా అందుతుంది. వీటితోపాటు నీళ్లు బాగా తాగితే ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. పిల్లలకు చిన్నప్పటి నుండి పండ్లు,కూరగాయలు,ఆకుకూరలు,గింజలు, అన్నీ సమపాళ్ళల్లో అందిస్తూ రాగి జావ, పప్పులతో కిచిడీ వంటివి ఆహారంలో భాగం చేస్తే వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైనంత పీచు లభిస్తుంది.జీవనశైలి మార్పులతో వచ్ఛే అనేక రోగాలకు అడ్డుకట్ట వేయగలము. ఈ చిన్నమార్పుతోనే ఎంతో లాభాన్ని పొందవచ్చు.ముందు పెద్దలు మారితే పిల్లలు మారతారు.