Monday 25 January 2021

జాతీయ పండుగ

                                                                 మన భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. అందరూ  కలిసి కట్టుగా ఉండడమే మన సంప్రదాయం.అందులో మన దేశానికి రెండు కళ్ళు రైతులు,సైనికులు .దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో  ప్రకృతి విపత్తుల వలన కానీ,మానవ తప్పిదాలవలన కానీ  వారికి సరైన  ప్రతిఫలం లభించడం లేదు. ఏది ఏమైనా ఇప్పటి నుండి అయినా  భగవంతుని దయవలన అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ,భారతీయురాలిగా పుట్టినందుకు గర్విస్తూ,మన దేశాన్ని ప్రేమిస్తూ మన భారతీయులందరికీ జాతీయ పండుగ అయిన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.             

తామర గింజలు

                                                           తామర గింజలు మనకు ప్రకృతి ప్రసాదించిన పరమౌషధం అని ఈమధ్యనే  తెలిసింది.ఎప్పుడన్నా ఒకసారి వాడడమే కానీ వీటి ప్రయోజనాలు అంతగా తెలియక పోవడంతో వీటిని ఎక్కువగా వాడుకోము.కానీ వీటిలో ఎన్నో పోషకాలతోపాటు వయసు మీద పడనీయని ఎంజైమ్ పుష్కలంగా ఉండడంతో చర్మం మృదువుగా ఉంటుందట.నిద్రలేమిని తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుతుందని,రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి రక్తపోటును నియత్రణలో ఉంచుతుందని తెలిసింది.దీనిలో కాలరీలు తక్కువ వుండి పీచు ఎక్కువ ఉండడంతో ఆకలి తగ్గి బరువు తగ్గడంతోపాటు చక్కర వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి  దోహదపడుతుంది.వీటిని నేతిలో వేయించి కొద్దిగా ఉప్పు,కారం చల్లి తింటే చాలా రుచిగా ఉంటాయి.ఫూల్ మఖానా అని పిలువబడే వీటిని ఎన్నో రకాల వంటలలో ఉపయోగించుకోవచ్చు.

Tuesday 12 January 2021

పెద్ద పండుగ శుభాకాంక్షలు

                                  సంక్రాంతి పండుగ అంటేనే మూడు  రోజుల పెద్ద పండుగ.భోగి,సంక్రాంతి,కనుమ.ఎన్నెన్నో పండుగ సంబరాలు.పిల్లలకు,పెద్దలకు కూడా ఎంతో హడావిడి.ఈ హడావిడిలో అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో,భోగభాగ్యాలతో తులతూగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నా బ్లాగ్ వీక్షకులకు,మిత్రులకు,శ్రేయోభిలాషులకు పెద్ద పండుగ అయిన భోగి,సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. 

నిండు కుండ

                                                 చరవాణిలో వార్తలు చూస్తున్న జయంతిని ఒక వార్త ఆకర్షించింది.  భూమి తన చుట్టూ తాను వేగంగా తిరగటం వలన 365 రోజుల కన్నా ఎక్కువ రోజులు పడుతుందని దీనితో రోజులో సమయం తగ్గడంతో రోజు త్వరగా గడిచిపోతుందని దీని గురించి ఆందోళన చెందుతూ ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారట అన్న వార్త  జానకిని ఆకర్షించింది? ఒకప్పుడు స్కైల్యాబ్ భూమిపై పడి అందరూ చనిపోతారని  చెప్పడంతో  అందరూ భయపడి ఎలాగూ చనిపోతామని ఉన్నన్నాళ్ళు దర్జాగా బ్రతుకుదామని ఉన్న ఆస్తులు అమ్మేసుకుని మరీ జల్సాలు చేశారు.చివరికి అది సముద్రంలో పడడంతో హమ్మయ్య బ్రతికిపోయాం అని ఊపిరి పీల్చుకున్నా ఆస్తులు అన్నీ అమ్మేసుకోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు.అందుకే ఏ వార్త విన్నా అతిగా కంగారుపడి ఆందోళన చెందడం అనవసరం.ఎప్పుడో ఏదో జరుగుతుందని మనం ఇప్పటినుండే కంగారుపడి అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోవడం  కూడా అనవసరం.ప్రశాంతంగా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ మానసికస్థైర్యాన్ని,ధైర్యాన్ని ప్రసాదించాలని నిర్మలమైన మనసుతో భగవంతుని ప్రార్ధించడం ఉత్తమం.అందరూ బాగుండాలి.అందరితోపాటు మనము బాగుండాలి.ఏది ఎప్పుడు?ఎలా?జరగాలో అలాగే  జరుగుతుంది.ఆందోళన పడడం వలన ప్రయోజనం శూన్యం.కనుక సానుకూల దృక్పధం అలవరచుకుంటే జీవితం  నిండు కుండలా ఎప్పుడూ తొణకకుండా ఉంటుంది.