మనకు అన్నీ ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటూ మనతో అధిక ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. బెల్లం చుట్టూ చేరిన ఈగల్లా మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ మనకు ఏదైనా అవసరం అనుకుంటే ఒక్కరు కూడా మన దరిదాపుల్లో ఉండరు.మన నుండి ఎంతో సహాయం పొందిన వాళ్ళు కూడా తన,పర అనే బేధం లేకుండా ముఖం చాటేస్తూ ఉంటారు.మనం ఎవరో తెలియకపోయినా సహాయం చేయడానికి వచ్ఛే వాళ్ళు కొంత మంది ఉంటారు.ఈరోజుల్లో ఎక్కువగా అవసరవాదులే ఉంటున్నారు. వాళ్లకు అవసరం అయినప్పుడు తియ్యగా మాట్లాడుతారు. అవసరం తీరిపోయాక మనం ఎవరో తెలియనట్లు నటిస్తుంటారు.ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం నేర్చుకోవాలి.అందరిని గుడ్డిగా నమ్మేసి మోసపోకుండా జాగ్రత్తగా ఉంటే ధన పరంగా నష్టపోకుండా ఉండడంతోపాటు, మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ఉంటాము. అవసరవాదులతో తస్మాత్ జాగ్రత్త.
No comments:
Post a Comment