ఒకప్పుడు నవ్వు నాలుగు విధాల చేటు అని బిగ్గరగా నవ్వితే పిల్లల్ని కోప్పడేవాళ్ళు పెద్దవాళ్ళు.ఇప్పుడు నవ్వు నవ్వించు అని చెప్పడం అలవాటు చేసుకున్నారు.ఈమధ్య నవ్వడమే మర్చిపోతున్నాము.నవ్వడం వలన మనస్సు తేలికగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.నవ్వడం వలన మనలో సానుకూలత పెరుగుతుంది. నవ్వుకి భాషతో సంబంధం లేదు.ఒక చిరునవ్వుతో ఎదుటివారిని పలకరించవచ్చు.నవ్వుతూ బ్రతకాలిరా అని సినీ రచయిత అన్నట్లు బ్రతికినన్నాళ్ళు నవ్వుతూ హాయిగా, ఆనందంగా బ్రతకాలి. ఎన్ని సమస్యలున్నా ముఖంపై నవ్వు చెదరనీయకూడదు.జీవితం అంటే పరుగు కాదు.జీవితం అంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండడం.నవ్వు నలుగురిని నవ్వించు.ఈ రోజుల్లో ఎంత ఆస్తి ఉన్నదనో, ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నదనో కాదు లెక్క ఎంత ఆనందంగా ఉన్నామనేదే లెక్క.చనిపోయేటప్పుడు కూడా నవ్వుతూ చనిపోయేవాళ్ళు అదృష్టవంతులు.అలాగే సానుకూలంగా ధృక్పదంతో ఉంటే తప్పకుండా సాధ్యపడుతుంది.ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఒక్కరోజే కాదు ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండండి.అందరికీ ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు.
Saturday, 2 May 2026
బియ్యం లేకుండా దోశ
ఉలవలు - 1 కప్పు
ఏదైనా ఒక చిరు ధాన్యం - 1 కప్పు
మినపగుళ్ళు - 1/2 కప్పు
మెంతులు - 1చిన్న చెంచా
వీటన్నింటిని శుభ్రంగా కడిగి విడివిడిగా 8 గం. నానబెట్టి మెత్తగా పిండి రుబ్బాలి. అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది.5,6 గం.నానబెట్టి వేసుకుంటే మెత్తగా ఉంటాయి.మనకు ఏ రకంగా నచ్చితే ఆలా వేసుకోవచ్చు.ఈ పిండిలో మనకు నచ్చిన ఆకుకూర సన్నగా తరిగి వేసుకోవచ్చు.కొద్దిగా సన్నగా తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కారట్ తురుము దోశపై వేసుకుంటే బాగుంటుంది.టమాటో, చట్నీ లేదా వేరుశెనగ చట్నీ, అల్లం పచ్చడి ఏదైనా వేసుకోవచ్చు. దోశ చాలా బాగుంటుంది.
నిద్రలేమి,ఒత్తిడికి అమ్మ చిట్కా
ఈ రోజుల్లో నిద్ర పట్టకపోవడం అన్నది సర్వసాధారణమై పోయింది. రోజూ 6 నుండి 8 గంటలు నిద్ర పట్టినట్లయితే ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది.దీనితోపాటు కొద్దిపాటి వ్యాయామం, అదే పనిగా ఒకేచోట కూర్చోకుండా మధ్యమధ్యలో నడుస్తున్నట్లయితే ఆరోగ్యం బాగుండడంతోపాటు మతిమరుపు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈమధ్య జరిపిన అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.అందుకోసం అమ్మ ఒక చిట్కా చెప్పింది అదేంటంటే సోంపు -50 గ్రా., మిరియాలు - 5 గ్రా., జాజికాయ - 2 1/2 గ్రా., యాలకులు - 10 గ్రా., బాదాంపప్పు 40 గ్రా., గసగసాలు - 30 గ్రా., పటికబెల్లం 20 గ్రా., బాగా ఎండబెట్టి పొడి చేసుకుని ఉ, సా. భోజనం తర్వాత 1 చెంచా చొప్పున నీళ్లతో కానీ పాలతో కానీ తీసుకోవాలి. ఈ విధంగా ఒక 20 రోజులు చేస్తే మంచి నిద్ర పట్టి ఒత్తిడి దరిచేరదు.మంచి అలవాట్లు చేసుకుంటే మన ఆరోగ్యంతోపాటు మన కుటుంబం కూడా బాగుంటుంది.