Tuesday 10 May 2022

మొదటి ముద్ద

                                                               ఈ రోజుల్లో చిన్నపెద్ద అనే తేడా లేకుండా మనలో చాలా మందికి ఆకలి మందగించడం లేదా పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించడం సర్వసాధారణం అయిపొయింది.దీనికి అంతటికి కారణం జీర్ణశక్తి మందగించడమే.మన ఇంట్లో ఉండే వస్తువులతోనే పొడి తయారుచేసుకుని మొదటి ముద్దలో రోజూ తినడం వలన జీర్ణ శక్తి పెరుగుతుంది.దీని కోసం మనం శొంఠీ పొడి ఒక చెంచా పిప్పళ్ళ పొడి ఒక చెంచా,దోరగా వేయించి చేసిన వాము పొడి ఒక చెంచా,కరక్కాయ పొడి ఒక చెంచా,సైంధవ లవణం ఒక చెంచా అన్నీ కలిపి ఒక సీసాలో పోసుకుని రోజూ ఈ పొడి ఒక అర చెంచా,ఒక చెంచా మంచి నెయ్యి కలిపి మొదటి ముద్దలో తింటే ఎటువంటి ఆహారం తిన్నా త్వరగా  అరిగిపోతుంది.దీన్ని ఎవరైనా పది సంవత్సరాలు దాటిన పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పాటించవచ్చు.

No comments:

Post a Comment