ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకం గురించి వ్రాయాలని అనిపించింది.పుస్తకం ఒక స్నేహితురాలు లేకపోతే స్నేహితుడు.కొంతమంది స్నేహితులతో అయినా మాట్లాడకుండా ఉండగలరేమో కానీ పుస్తకం చదవకుండా ఉండలేరు.నేను కూడా అంతే.బహుశా ఆ అలవాటు మా తాతగారి నుండి వచ్చింది. ఆయన ఒక పుస్తకం చదవడం మొదలు పెడితే అది అయిపోయేవరకు చుట్టుప్రక్కల ఏమీ జరుగుతుందో పట్టించుకోనంతగా పుస్తక పఠనంలో లీనమైపోయేవారు. ఇ - పుస్తకాలు రావడంతో ఈ రోజుల్లో పుస్తకాలు చదివేవాళ్ళు తగ్గినా కూడా పుస్తక ప్రియులు ఉండబట్టే పుస్తక మహోత్సవాలు కళకళలాడుతున్నాయి.రోజు ఒకే పుస్తకం చదివినా ఒక్కోరోజు ఒక్కొక్క రకంగా అర్థం స్పురిస్తుంది. రోజూ పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.మన ఆలోచనల్లో మార్పుతోపాటు జ్ఞానం వస్తుంది. ఈరోజు నుండి పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి.రోజులో కొద్దిసేపైనా చదవడానికి ప్రయత్నించండి.
No comments:
Post a Comment