ఈ రోజుల్లో నిద్ర పట్టకపోవడం అన్నది సర్వసాధారణమై పోయింది. రోజూ 6 నుండి 8 గంటలు నిద్ర పట్టినట్లయితే ఒత్తిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది.దీనితోపాటు కొద్దిపాటి వ్యాయామం, అదే పనిగా ఒకేచోట కూర్చోకుండా మధ్యమధ్యలో నడుస్తున్నట్లయితే ఆరోగ్యం బాగుండడంతోపాటు మతిమరుపు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈమధ్య జరిపిన అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.అందుకోసం అమ్మ ఒక చిట్కా చెప్పింది అదేంటంటే సోంపు -50 గ్రా., మిరియాలు - 5 గ్రా., జాజికాయ - 2 1/2 గ్రా., యాలకులు - 10 గ్రా., బాదాంపప్పు 40 గ్రా., గసగసాలు - 30 గ్రా., పటికబెల్లం 20 గ్రా., బాగా ఎండబెట్టి పొడి చేసుకుని ఉ, సా. భోజనం తర్వాత 1 చెంచా చొప్పున నీళ్లతో కానీ పాలతో కానీ తీసుకోవాలి. ఈ విధంగా ఒక 20 రోజులు చేస్తే మంచి నిద్ర పట్టి ఒత్తిడి దరిచేరదు.మంచి అలవాట్లు చేసుకుంటే మన ఆరోగ్యంతోపాటు మన కుటుంబం కూడా బాగుంటుంది.
No comments:
Post a Comment