Monday 19 October 2020

నిర్మల తటాకం

                                                          పెద్దలకు నా నమస్కారం.పిన్నలకు నా శుభాశ్సీసులు.పండుగకు ఇల్లు శుభ్రం చేసుకోవడం అయిపోయిందా అండీ ?నవరాత్రి,విజయదశమి సందర్భంగా అమ్మవారి పూజలతో హడావిడిగా ఉన్నారా ? ప్రత్యక్షంగా పూజలు చేయలేని వారు మనసులో నైనా  ప్రార్ధించవచ్చు.దీనికి సమయ నియమం లేదు.మనకు ఎన్ని పనులున్నా ఆ పనులు చేసుకుంటూనే మనసులో అమ్మవారిని తలచుకోవచ్చు.దీనితో మానసిక ఒత్తిడులన్నీ తొలగిపోయి మనసులో ప్రశాంతత గూడు కట్టుకుంటుంది.ఎటువంటి మానసిక ఆందోళన లేకపోవడంతో మనసు నిర్మల తటాకం అవుతుంది.మనకోసం మాత్రమే  కాకుండా సమస్త మానవాళి కోసం  సర్వేజనా సుఖినోభవంతు అంటూ రాగద్వేషాలకు అతీతంగా లోక కళ్యాణం కోసం ప్రార్ధించడం చాలా మంచిది.అప్పుడు మన మనసులు కూడా మంచితనంతో, ప్రేమానురాగాలతో నిండి ఉంటాయి.  మనసారా ప్రార్ధిస్తే ఎలాంటి సమస్యలు అయినా ఇట్టే తొలగిపోతాయని,సమస్యకు సరైన పరిష్కార మార్గం లభిస్తుందని మన పెద్దల మాట.ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఏవిధంగా పూజ చేసినా అమ్మవారి కృపాకరుణాకటాక్షవీక్షణాలు మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ నవరాత్రి ,విజయదశమి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 

No comments:

Post a Comment