Tuesday 6 October 2020

పంచ కళ్యాణి

                                                            శ్రీర్జిత్ కి రకరకాల జంతువులను,పక్షులను పెంచడం అంటే మహా సరదా.చిన్నప్పటినుండి కుక్క పిల్లల్ని పెంచుకుందామని ఏడ్చేవాడు.15 సంవత్సరాలు వచ్చేటప్పటికి స్నేహితుని ఇంట్లో కుక్క పిల్లల్ని పెట్టిందని తెలిసి ఒకదాన్ని ఇంటికి తీసుకుని వచ్చాడు.అది ముద్దుగా బొద్దుగా తెల్లగా ఉండేసరికి పెద్దవాళ్ళు కూడా ఏమి మాట్లాడలేక పోయారు.అలా శ్రీర్జిత్ వయసు పెరుగుతున్న కొద్దీ రకరకాల కుక్కలు,కోళ్ళు,ఆవులు,ఎద్దులు, కుందేళ్ళు పెంచడం  మొదలు పెట్టాడు.తాజాగా ఇంటిలో ఎవరికీ చెప్పకుండా 'పంచ కళ్యాణి ' అని ఒక గుర్రం కొని ఇంటికి తెచ్చాడు.దాన్ని చూడడానికి చుట్టు ప్రక్కల పిల్లలందరు తండోపతండాలుగా రావడం మొదలు పెట్టారు.మొదటి రోజు పోనీలే అని కాసేపు గుర్రంపై  ఎక్కించి రహదారిలో అటునుండి ఇటు చివరకు ఒకసారి తిప్పారు.దానితో ఊరిలో పిల్లలు అందరూ శ్రీర్జిత్ ఇంటి ముందు వరుస కట్టారు. వీటన్నింటి బాగోగులు చూడడానికి ఐదారుగురు పనివాళ్ళు,గిత్తలు,ఎద్దులు అంటే ఉన్న మోజుతో  వచ్చి కొంతమంది ఉచిత సేవలు చేసి వెళ్ళేవాళ్ళు.మాములుగానే  వాకిలి నిండా ఎప్పుడూ జనంతో  కిటకిటలాడుతూ ఉంటుంది.ఇప్పుడు పంచ కళ్యాణి పుణ్యమా అని  దాన్ని చూడడం కోసం పిల్లలు,వాళ్ళని బుజ్జగించి ఇంటికి తీసుకెళ్ళడానికి పెద్దలు రావడంతో వాకిలితోపాటు రహదారి కూడా నిండి పోతుంది.ఎవరైనా పెద్దవాళ్ళు వీటన్నింటినీ పెంచడం,ఇంటి నిండా ఎప్పుడూ జనాలు ఈ తలనొప్పులు ఎందుకు శ్రీర్జిత్ ? అంటే నాకు మూగజీవాలను పెంచడం ఎంతో ఇష్టం.నా ఈ అభిరుచి నాకు ఎంతో సంతృప్తితోపాటు ఆనందాన్నిస్తుంది అని చెప్తూ ఉంటాడు శ్రీర్జిత్.                

No comments:

Post a Comment