ఉలవలు - 1 కప్పు
ఏదైనా ఒక చిరు ధాన్యం - 1 కప్పు
మినపగుళ్ళు - 1/2 కప్పు
మెంతులు - 1చిన్న చెంచా
వీటన్నింటిని శుభ్రంగా కడిగి విడివిడిగా 8 గం. నానబెట్టి మెత్తగా పిండి రుబ్బాలి. అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది.5,6 గం.నానబెట్టి వేసుకుంటే మెత్తగా ఉంటాయి.మనకు ఏ రకంగా నచ్చితే ఆలా వేసుకోవచ్చు.ఈ పిండిలో మనకు నచ్చిన ఆకుకూర సన్నగా తరిగి వేసుకోవచ్చు.కొద్దిగా సన్నగా తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కారట్ తురుము దోశపై వేసుకుంటే బాగుంటుంది.టమాటో, చట్నీ లేదా వేరుశెనగ చట్నీ, అల్లం పచ్చడి ఏదైనా వేసుకోవచ్చు. దోశ చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment