సత్తెమ్మ కూతురు చదువుకుని ప్రయోజకురాలై కొద్ది రోజులు విదేశాలలో ఉండి డబ్బులు సంపాదించుకుని తిరిగి స్వదేశానికి వచ్చి అమ్మానాన్నలను పెద్దవయసులో తనే దగ్గరుండి జాగ్రత్తగా చూచుకోవచ్చని వెళ్ళింది.ఏ వయసు ముచ్చట ఆ వయసుకని అమ్మానాన్నలు పెళ్ళి చేశారు.ఆమెకు కూతురు పుట్టింది.తను ఉద్యోగానికి వెళ్ళటం కోసం మనవరాలిని పెంచటానికి అమ్మానాన్నలను తన దగ్గరకు తీసుకెళ్ళింది.ఒక ఆరునెలల తర్వాత సత్తెమ్మ ఇంటికి తిరిగి వచ్చింది.సంబరంగా విదేశంలో ఉన్న కూతురి కబుర్లు అందరికీ చెబుతూ మధ్యలో అక్కడ దిబ్బరొట్టె మీద దిబ్బరొట్టె పెట్టి దాని మధ్యలో కూరగాయలు పెడతారని అది తిన్నానని చెప్పింది.మొదట వింటున్న వాళ్ళకు అర్ధం కాలేదు కానీ తర్వాత బర్గర్ అని అర్దమయింది.సత్తెమ్మ తనకు తెలిసిన భాషలో భలే వివరించిందని,ఆ చెప్పే విధానానికి వింటున్న అందరికీ నవ్వు వచ్చింది.
Wednesday, 4 November 2015
Tuesday, 3 November 2015
స్వతంత్రంగా.......
జీవితం ఎప్పుడూ ఒకేవిధంగా ఉంటే నిరాసక్తంగా అనిపిస్తుంటుంది.నిరాసక్తత ఎక్కువైతే ఆత్మన్యూనత ఏర్పడుతుంది.దీనిలో నుండి ఎంత త్వరగా బయటపడాలంటే అంత త్వరగా మార్పుకోసం ప్రయత్నించాలి.ముందుగా మన మనసుకు నచ్చిన పని చేస్తే ఎవరేమనుకుంటారో అని ఆలోచించడం మానేయాలి.ప్రతి పనినీ అందరికీ నచ్చేలా చేయడం చాలా కష్టం.ఇది ఎదుటివారికి కూడా వర్తిస్తుంది.ఈ చిన్న ప్రాధమిక సూత్రం గుర్తుంచుకుంటే దేన్నైనా స్వతంత్రంగా చేయగలుగుతారు.వ్యాపారమైనా,ఉద్యోగమైనా ఎవరి అబిరుచికి తగినట్లుగా వాళ్ళు చేస్తే ఉత్సాహంగా చేయగలిగి బాగా రాణిస్తారు.
ఆభరణాలు సరికొత్తగా.......
బంగారు,వెండి ఆభరణాలు కొన్నాళ్ళకు పాతవాటిలా కనిపిస్తుంటాయి.
అలాంటప్పుడు ఒక గిన్నెలో నిమ్మరసం,నీళ్ళు సమపాళ్ళల్లో తీసుకుని దానిలో ఆభరణాలను ఒక అరగంటపాటు నానబెట్టి తర్వాత తీసి మామూలు నీళ్ళతో శుభ్రంగా కడిగి మెత్తటి వస్త్రంతో తుడిస్తే సరికొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి.
Monday, 2 November 2015
చక్కటి అనుబంధం
రాజారావు గారికి పుస్తకాలన్నా,పుస్తకాలను చదవటంఅన్నా ఎంతో ఇష్టం.ఎక్కడకు వెళ్ళినా నచ్చిన పుస్తకాలను ధర ఎంతైనా కొని ఇంట్లో భద్రపరచటం,తీరిక సమయంలో వాటిని చదవటం అలవాటు.తన మనవడు,మనవరాలు చదవటం కోసం ఒక చిన్న గ్రంధాలయాన్ని ఇంట్లోనే ఏర్పాటు చేశారు.వాళ్ళకు తాతయ్య దగ్గరకు రావటం,తాతయ్య చెప్పే కథలు వినడం,చదవటం ఎంతో ఇష్టం.అంతగా పిల్లలకు ఎందుకు ఇష్టం అంటే పిల్లలకు నచ్చేచక్కని బొమ్మలు,కార్టూన్లు,పజిళ్ళు,పిల్లలను ఆకట్టుకునే రంగుల్లో ఉండే నీతి కథల పుస్తకాలను తెచ్చి తన గ్రంధాలయంలో పెడుతూ ఉంటారు.వీటిల్లో బొమ్మలు వేసేవి,బొమ్మలకు రంగులు దిద్దేవి,పజిళ్ళు పూర్తి చేసేవి,బొమ్మలతో ఉన్న కథల పుస్తకాలు ఎక్కువ ఉంటాయి.దానికి తోడు రాజారావుగారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా పిల్లలు రాగానే అవన్నీ పక్కన పెట్టి రకరకాల హావభావాలతో కథలు చదివి విడమరచి చెప్తూ,వాళ్ళకు నచ్చిన ఆటలు ఆడుతూ వాళ్ళతోనే ఎక్కువ సమయం గడపటంతో పిల్లలకు తాతయ్యతో అనుబంధంతోపాటు,పుస్తకాలతో కూడా చక్కటి అనుబంధం ఏర్పడింది. అందుకని పిల్లలకు స్వంతంగా కథలు చెప్పడం,చదవటం,చదివింది అర్ధం చేసుకోవటం చిన్నతనం నుండే అలవాటయింది.ఎవరికయినా చిన్నప్పటినుండి తరగతి పుస్తకాలే కాక,విడి పుస్తకాలు కూడా చదవటం అలవాటు చేస్తే వారికి విజ్ఞానంతోపాటు,సామజిక అవగాహన,కష్టనష్టాలు ఎదుర్కోగలిగే మానసిక స్థైర్యం,పరిణతి ఉంటుంది.రకరకాల పుస్తకాలు చదవటం వల్ల భాషపై పట్టు వస్తుంది.
అమ్ముకునేవాళ్ళ కన్నా.....
స్పందన కొడుకు శ్రీహర్ష ఉన్నత విద్యను అభ్యసిస్తూ హాస్టల్ లో ఉంటున్నాడు.సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చాడు.కొడుకు ఇబ్బంది పడకుండా అవసరమైన వస్తువులు సర్ది ఉంచితే అన్నీ ఉన్నాయి.ఏమీ వద్దంటూ తీసి పక్కన పెట్టాడు.స్పందన తీసుకెళ్ళు నాన్నా!అవసరమైతే ఉంటాయి కదా!అని ఒక్కొక్కటి మళ్ళీమళ్ళీ తీసి ఇస్తుంటే ఏంటమ్మా?సామాన్లు అమ్ముకునే వాళ్ళు కొనండి అంటూ వెంటబడి విసిగించినట్లుగా నువ్వు వస్తువులు తీసుకెళ్ళు నాన్నా!అంటూ అమ్ముకునే వాళ్ళ కన్నా కనాకష్టంగా హింస పెట్టేస్తున్నావు? దయచేసి నన్నువదిలేయ్ అమ్మా!అన్నాడు.ఇదేమిటి?ఎంతో ప్రేమతో ఇస్తుంటే హింస పెడుతున్నట్లుగా ఉంది కాబోలు.ఏమి పిల్లలో ఏమిటో?అనుకుంది స్పందన.
సన్నటి మేకప్ బ్రష్ తో.........
కంప్యూటర్ కీబోర్డ్ పై దుమ్ము,ధూళి పేరుకుపోయినప్పుడు సన్నటి,మెత్తటి మేకప్ బ్రష్ తో దులిపితే తేలికగా శుభ్రపడుతుంది.
Sunday, 1 November 2015
సోయా గ్రాన్యూల్స్ వడ
సోయా ఆకు,పాలు,సోయా గ్రాన్యూల్స్ ఏరూపంలో తీసుకున్నాఆరోగ్యానికి చాలా మంచిది.ఎప్పుడూ ఒకే రకంగా గ్రాన్యూల్స్ టొమాటోతో కలిపి కూర మాత్రమే వండుకునే కన్నావడల్లా వేస్తే బాగుంటుంది.
సోయా గ్రాన్యూల్స్ - 1 కప్పు(పొట్టు లాంటిది)
బ్రెడ్ పొడి - 1 కప్పు
బంగాళ దుంప - 1 పెద్దది
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చి మిర్చి - 5
కొత్తిమీర - చిన్న కట్ట
ఉప్పు - తగినంత
మొక్కజొన్న పిండి - 2 స్పూనులు
గరం మసాలా - 1 స్పూను
టొమాటో కెచప్ - 1 స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
సోయా గ్రాన్యూల్స్ - 1 కప్పు(పొట్టు లాంటిది)
బ్రెడ్ పొడి - 1 కప్పు
బంగాళ దుంప - 1 పెద్దది
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చి మిర్చి - 5
కొత్తిమీర - చిన్న కట్ట
ఉప్పు - తగినంత
మొక్కజొన్న పిండి - 2 స్పూనులు
గరం మసాలా - 1 స్పూను
టొమాటో కెచప్ - 1 స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
సోయా గ్రాన్యూల్స్ పొట్టు వేడినీటిలో వేసి 5 ని.ల తర్వాత నీళ్ళు వంపేసి కొద్దిగా చల్లటి నీళ్ళు పోసి గట్టిగా పిండి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేయాలి.బంగాళదుంప ఉడికించి ముద్దలా చేయాలి. ఉల్లిపాయ,పచ్చి మిర్చి ముక్కలు సన్నగా కోసి పెట్టుకోవాలి.కొత్తిమీర సన్నగా తరగాలి.వీటన్నింటిని,మిగిలిన పదార్ధాలను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.దీన్ని చిన్నచిన్న వడల్లాగా చేసి కాగుతున్న నూనెలో వేయించి తీయాలి.వీటిని రెడ్ చిల్లీ సాస్ తో కానీ.టొమాటో సాస్ తో కానీ తింటే రుచిగా ఉంటాయి.
Subscribe to:
Posts (Atom)