Monday 18 November 2013

అమ్మో నీళ్ళు పడిపోతానేమో

                                              మేము    అలహాబాద్ లో ఉన్నప్పుడు  ఒకసారి త్రివేణి సంగమం చూడడానికి
వెళ్ళాము. అప్పుడు నాకు మూడు సంవత్సరములు.త్రివేణిసంగమము అంటే మూడు నదుల కలయిక .గంగ
యమున,సరస్వతి నదులు కలిసిన  ప్రదేశాన్నే త్రివేణిసంగమం అంటారు. సరస్వతీనది అంతర్వాహిని.గంగానది,
యమునానది మామూలుగా ప్రవహిస్తాయి. అమ్మ,నాన్నగారు,నేను రావు మామయ్య అందరము కలసి పడవ
ఎక్కడానికి వెళ్ళాము.రావు మామయ్యకు నేనంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా ఎత్తుకొనే వెళ్ళేవాడు.పడవలో ఎక్కి
మధ్యలోకి వెళ్ళిన తర్వాత నాకు భయం  వేసింది .ఒకటే ఏడుస్తూ నేను నీళ్ళల్లోపడిపోతానేమో వెళ్ళిపోదాముఅని గొడవ చేస్తుంటే అలా అనకూడదు అని చెప్పారు .ఒక అరవై సంవత్సరాల క్రితం నీళ్ళల్లో ప్రయాణం చే స్తూ అలా అంటే ఎక్కడో నిజంగానే పడవ మునిగిపోయిందట .అందుకని అలా చిన్నపిల్లలు మాట్లాడకూడదు అని చెప్పారు.కానీ  
వాళ్లకి కుడా భయం వేసింది. పడవను వెనక్కి తీసుకునివెళ్ళమని చెప్పారు. ఒడ్డుకు వచ్చేవరకూ ఒకటే నమస్కారములు చేసుకొన్నారు. చల్లగా ఒడ్డుకుచేర్చండి  అమ్మా మమ్మల్ని అంటూనమస్కరిస్తూనే ఉన్నారు.
ఒడ్డుకు వచ్చిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. తిరిగి మరల కృతజ్ఞతతో నమస్కరించి ఇంటికివచ్చారు.
కానీ నాకు మాత్రం అంత ఎక్కువగావున్నా పెద్ద ప్రవాహాలను చూస్తే ఒక్క క్షణం ఒళ్ళుజలధరించినట్లు అవుతుంది.
చాలా సంవత్సరాల వరకూ  ఆ భయం పోలేదు.తర్వాత మామూలైపోయింది.కానీ ఇప్పటికీ సముద్రం కానీ ,పెద్ద నదులను కానీ చూడగానే అలాగే అనిపిస్తుంది .అంతగా మనసులో ముద్ర పడిపోయింది. 






































No comments:

Post a Comment