Wednesday, 28 May 2014

చచ్చిపోయిన తర్వాత వెళ్తారా?

                  శామ్యూల్ బంధువు ఒకాయన చావుబతుకుల్లో ఆస్పత్రిలో ఉన్నాడు.అతని దగ్గరకు ఎక్కువమంది రాకూడదు అని,ఒక్కళ్ళు,ఇద్దరు వెళ్ళినా స్టెరైల్ గా వెళ్ళాలని వైద్యులు సూచించారు.ఆయనభార్య మాత్రమే దగ్గర ఉంటుంది.భార్యకు కూడా ఎవరూ రావటం ఇష్టంలేదు.అందుకని దగ్గరి బంధువు అదే ఊరు వెళ్ళినా ఆసుపత్రికి వెళ్ళలేదు.ఇంకొక బంధువు ఫోనుచేసి మరీ ఆసుపత్రిలో ఉన్నబంధువుని చచ్చిపోయిన తర్వాత చూడటానికి వెళ్తారా ఏమిటి?అని శామ్యూల్ ని అడిగాడు.శామ్యూల్ అక్కడకు ఎవరినీ రానివ్వటంలేదు.వెళ్ళటం మనకూ
మంచిదికాదు వాళ్ళకు మంచిదికాదు సీరియస్ కండిషన్ కనుక మనం చేయగలిగింది ఏమీలేదు చనిపోయిన
తర్వాత వెళ్ళడమే అని చెప్పాడు. 

Tuesday, 27 May 2014

విమర్శ

                 పంకజ్ ఎప్పుడూ ఎదుటివారిని విమర్శిస్తూ ఉంటాడు.ఎదుటివారు తెలివి తక్కువవాళ్లు,తిక్కవాళ్ళు తానొక్కడే తెలివిగలవాడిని,మంచివాడిని మిగతావాళ్ళందరూ దేనికీ పనికిరారు అనుకుంటాడు.తనసంసారం ఒకటి తిన్నగా లేదు.భార్య,పిల్లలు అతనిమాట వినరు.అతను ముందు మాట్లాడితే వెనుక వాళ్ళు పిచ్చితిట్లు  తిడుతూ ఉంటారు.అయినా తనకు అసలు ఆవిషయమే తెలియనట్లు నటిస్తాడు.ఎక్కడ ఆవిషయం బయటపడితే తనకు వెనుక తాటాకులు కడతారోనని అంటే తనను ఎవరు లెక్కచేయరేమోనని  భయం.అది బయటపడకుండా
అందరినీ అరుస్తూ విమర్శిస్తాడు.ఎదుటివారిని విమర్శించే ముందు మనం సరిగ్గా ఉన్నామా, లేదా? అని ఆలోచించుకోవాలి.

Monday, 26 May 2014

తస్మాత్ జాగ్రత్త

               ధార్మిక ఇంట్లో పనిమనిషి ఒక రెండునెలలు ఊరు వెళ్ళింది.వేరేఅమ్మాయిని పెట్టుకుందామనుకున్నారు.
కానీ సరయిన మనిషి దొరకలేదు.ధార్మికకు తెలిసిన పనిమనిషి తనకు బాగా తెలుసని ఒకఅమ్మాయిని వెంట తీసుకొచ్చింది.ధార్మిక మంచిఅమ్మాయేనా? అని అడిగితే చాలామంచిదని చెప్పింది.బంధువులు వస్తే వాళ్ళ బట్టలు ఉతకమంటే సరేనని బట్టలు ధార్మిక ఎదుటే నానబెట్టింది.ధార్మిక తమ్ముడు చూడకుండా సీక్రెట్ పోకెట్లో పెట్టిన పదివేల రూపాయలతో సహా ప్యాంటుఉతకటానికి వేశాడు.ఆవిషయం ఎవరూ గమనించలేదు.దొంగది గమనించి
వద్దన్నా వినకుండా మిగాతా బట్టలు ఉతుకుతానని బలవంతాన బట్టలు తీసుకుని రమ్మంది.ధార్మిక లోపలకు వెళ్ళగానే క్రొత్తపదివేలరుపాయల కాగితాలు పది తీసేసింది.ధార్మిక వచ్చేసరికి బట్టలు ఉతుకుతున్నట్లునటించింది.
దొంగది వెంట భర్తని,కూతుర్నికూడా తీసుకొచ్చింది.ధార్మిక తమ్ముడికి నాలుగైదుగంటల తర్వాత డబ్బు విషయం గుర్తొచ్చింది.వెంటనే పిలిపించి అడిగితే నాకుతెలియదు,నేను తీయలేదు అంటుంది కానీ భయపడుతూ బిక్కచచ్చిపోయింది.ఆడదానిమీద కేసుపెట్టి,కొట్టించడం ఎందుకులే అదే తీసుకుందని,ఆమెకుతప్ప ఎవరికీ అవకాశం లేదని,అది డబ్బు తిరిగి ఇవ్వ్దదల్చుకోలేదు కనుక ఇక అనవసరమని వదిలేశారు.తర్వాతరోజువెరేఇంట్లో   పనికి వెళ్ళి బంగారపు చెవి పోగులు తీసుకుంది.వాళ్లుకేసు పెట్టి అరెస్ట్ చేయించారు.వాళ్ళు నాలుగు వేసేసరికి మాయరోగం వదిలింది.అయినామళ్ళీనేను తీయలేదనే మాటచెప్తుంది."పరులసొమ్ము పాము వంటిది" అనే జ్ఞానం లేకుండా దొంగతనం చేయటం మొదలెట్టింది.ఇన్నాళ్ళకు దీని పాపం పండింది దీనివల్ల మనల్నికూడా నమ్మటంలేదు అని తోటి  పనిమనుషులుఅనుకున్నారు. ఈరోజుల్లో ఎవర్నీ నమ్మలేము "తస్మాత్ జాగ్రత్త ".

వసుధైకకుటుంబం

            పరంధామయ్యగారికి పదిమంది సంతానం.వారిలో ఆరుగురు కొడుకులు,నలుగురు కూతుళ్ళు.ఇంతకు
ముందురోజుల్లో ఎక్కువమందికి అధిక సంతానం ఉండేది.కూతుళ్ళ పెళ్ళిళ్ళయిన తర్వాత కొడుకుల పెళ్ళిళ్ళు
వరుసనేచేశారు.కొడుకులు,కోడళ్ళు,పరంధామయ్యగారు,ఆయనభార్య అందరూ ఒకేఇంటిలో కలిసిమెలిసి
ఐకమత్యంతో ఉండేవారు.ఇంటిపెద్దలు పరంధామయ్యగారు,ఆయనభార్య మాటలు ఇంట్లో అందరికీ వేదవాక్కు.
కోడళ్ళందరూ ఒక్కొక్క పనిచేస్తూ ఎవరిపనివాళ్ళు చేసుకుంటూ అందరూ సరదాగా,సంతోషంగా ఇంటిని
చక్కదిద్దేవారు.మనుమలు,మనుమరాళ్ళు పెద్దయ్యి,వాళ్ళచదువులు,పెళ్ళిళ్ళయ్యేవరకు కూడా కలిసే ఉన్నారు.
ఊరిలో అందరూ పరంధామయ్యగారి వసుధైకకుటుంబాన్నిచూచి ముచ్చటపడి కుటుంబమంటే అలాఉండాలని
అనుకునేవారు.ఇన్ని సంవత్సరాలు ఏపొరపొచ్చాలు లేకుండా చక్కగా ఉన్నారు.నాకూఓపిక తగ్గిందికనుక ఆస్తి
పంపకాలు చేస్తాను.మీకు ఇష్టమైతే కలిసి ఉండొచ్చు లేకపోతే ఎవరికివాళ్ళు వేరుగా ఉండండి అని కొడుకులకు పరంధామయ్యగారు చెప్పారు.తర్వాతికాలంలో కూడా కొంతమంది కలిసిఉన్నారు.అన్నిరోజులు కలిసి ఉండటం
అందరి గొప్పతనం.    

Sunday, 25 May 2014

మధురానుభూతి

        మృదుల కుటుంబం షిర్డీ సాయినాధుని దర్శనార్ధం షిర్డీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా మనము          మాత్రమే వెళ్ళేకన్నా కుటుంబం మొత్తం కలిసివెళ్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది.ఆలోచన వచ్చిందే తడవుగా అత్తింటివారికి,పుట్టింటివారికి ఫోన్లుచేసి ప్రయాణంసంగతి చెప్పగానే ఒకరిద్దరు మినహాయించి అందరూ
వస్తామని ఎగిరి గంతేశారు.ఎండలు ఎక్కువగా ఉండటం వలన ఎక్కువరోజులు అక్కడ ఉండటం కష్టం కనుక
మొత్తం చూడకుండానే మూడురోజుల్లో తిరిగి ఇంటికి వచ్చేశారు.అయినాకూడా షిర్డీ సాయినాధుని దర్శనభాగ్యంతో
కలిగిన దివ్యానుభూతితోపాటు,కుటుంబసభ్యులందరితో కలిసి చిన్నప్పటినుండి ఇప్పటివరకు ఉన్నముచ్చట్లన్నీ
చెప్పుకుంటూ ప్రయాణించటం,అందరూ కలిసి బాబాను దర్శించుకోవటం వలన మృదుల కుటుంబం ఎంతో సంతోషంతో ఎన్నో మధురానుభూతుల్ని ప్రోగుచేసుకున్నట్లయింది.

Monday, 19 May 2014

స్వంతింటి కల

     మిధులకళాశాలోచదువుకునేరోజుల్లోఒకసారిస్నేహితురాళ్ళందరూకూర్చునిఉండగాస్వంతఇల్లు ఎవరిఅభిరుచికితగినట్లువాళ్ళుకట్టుకుంటారు.ఒక్కొక్కళ్ళకుఒక్కొక్కఅభిప్రాయం ఉంటుంది.ఎవరి" స్వంతింటికల", అభిరుచులు వాళ్ళని చెప్పమన్నారు.అందరూ ఎవరి అభిప్రాయలు వాళ్ళు చెప్పారు.మిధుల వంతు వచ్చింది.
మిధుల తనకు పెద్దస్థలంలో గాలి,వెలుతురు ఇంట్లోకి ధారాళంగా వచ్చేలా,చుట్టూ అందమైనతోటను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది.ఆఅందమైనతోటలోఇంట్లోనుండి బయటకువెళ్ళి కొనుక్కోవాల్సినఅవసరం లేకుండా చిన్నవి,పెద్దవి,ఆకుకూరలు, పూలమొక్కలు,పండ్లచెట్లు,కూరగాయల మొక్కలు  వేటికవి చక్కగా పద్ధతిప్రకారం పెంచాలని ఉందని తన మనసులో మాట చెప్పింది.కాలక్రమేణా మిధులకు,స్నేహితురాళ్లకు పెళ్ళిళ్ళయి స్థిరపడ్డారు.మిధుల కళాశాలరోజుల్లో చెప్పినట్లుగా పెద్దస్థలంలో గాలి,వెలుతురు,మొక్కలు అందంగా
పెట్టింది కానీ చుట్టూ అందమైనతోటను తన అభిరుచికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోలేకపోయింది.సిటీల్లో ఉండేవాళ్లకు ప్రస్తుతం సాధ్యంకానిపని.అప్పటి స్నేహితురాలు అప్పుడప్పుడు ఫోనుచేసి మరీనువ్వుఅప్పుడు
చెప్పినట్లుగా"స్వంతింటి కల"నేరవేర్చుకోలేకపోయావు అని సతాయించుతూ ఉంటుంది.మిధుల ప్రతిదీ తేలిగ్గా   సానుకూలదృక్పధంతో అలోచిస్తుంటుంది.ఆమెతో ఇంకాసమయం ఉందికదా!నా"స్వంతింటి కల"నేరవేర్చుకోగలనని ఆశిస్తున్నాను నువ్వు దానిగురించి కంగారుపడాల్సిన అవసరంలేదు అని చెప్పింది.
  

వెక్కిరింత

           మృణాళిని రకరకాలభాషలు నేర్చుకుందామని వెళ్ళింది.అక్కడ నేర్పించేదానికన్నావెక్కిరింతలు ఎక్కువ.
ఒక్కొక్కరిది ఒక్కో భాష.అందరి మాటతీరు ఒకేరకంగా ఉండదుకదా.ఒక్కో ప్రాంతీయభాష ఒక్కొక్కరిది.మృణాళిని
వెనుకబడిన ప్రాంతంనుండి వచ్చింది.మృణాళిని భాష అందరికీ అర్దంకాదు.భాషలు నేర్పుతానన్న గురువు ఈమె
భాషను అనుకరించి అలా మాట్లాడుతుంది,ఇలా మాట్లాడుతుందని వెక్కిరించేది.మృణాళిని అసలే కంగారు మనిషి.
గురువు స్థానంలో ఆమె అలా వెక్కిరిస్తుంటే బుర్ర పనిచేసేదికాదు.ఒకటి అడిగితే ఒకటి చెప్పేది.ఎప్పుడూ ఏదోఒకటి
ఆలోచిస్తావేమిటి?అని గదమాయించేది.ఎవరిభాష వారిది అలా వెక్కిరించటం ఏమి పద్ధతి? నాకు చాలాబాధగాఉంది
అంటూ మిగతావాళ్ళ దగ్గర బాధపడేది.ఆబాధ అనుభవించేవాళ్లకుమాత్రమే తెలుసు. ఎవరుమాత్రం ఏమి సలహా చెప్పగలరు.మాట్లాడేఆమెకు ఉండాలి.మనం ఒకళ్ళను వెక్కిరిస్తే మనల్ని ఇంకొకళ్ళు వెక్కిరిస్తారు.అన్నీమనకే తెలుసు అనుకోవటం పొరపాటు."తాడిని తన్నేవాడు ఒకడుంటే దాని తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు."