Tuesday, 5 January 2016

మొక్కను పెడితే......

                                                                అపార్టుమెంటులలో ఇంటి ముఖద్వారం పొడవైన కారిడార్ చివర ఉన్నట్లయితే అక్కడ ప్రవహించే శక్తి చాలా ఉధృతంగా ఉంటుంది.ఈ విధంగాఉంటే ఆర్ధిక పెట్టుబడులపై ప్రభావం చూపి ఇబ్బందులు కలుగుతాయి.ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక పక్కగా ఒక మొక్కను పెడితే ఆ ప్రభావం తగ్గుతుంది. 

చర్మం పొడిబారి తెల్లగా ఉంటే.........

                                                                 చలి ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం పొడిబారి తెల్లగా ఉంటుంది.అలా ఉన్నప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా నువ్వుల నూనె కానీ ఆలివ్ నూనె కానీ లేదా 1/4 కప్పు పాలు కానీ కలిపి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాటిమాటికి మోచేతులు,మోకాళ్ళ వద్ద చర్మం పొడిబారి తెల్లగా కనిపిస్తుంటే కొద్దిగా పంచదార,తేనెలో కలిపి ఆ ప్రదేశంలో  సున్నితంగా రాయాలి.మృదువుగా తయారవుతుంది.పాదాలకు,చేతులకు వీలయినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే గరుకుదనం తగ్గి చర్మం పొడిబార కుండా, పగుళ్ళు రాకుండా ఉంటుంది.

Monday, 4 January 2016

ఓరి నీ దుంప తెగ!

                                                            కొంతమందికి కొన్ని ఊతపదాలు మాట్లాడటం అలవాటు.అలాగే విక్రాంత్ వాళ్ళ తాతల కాలం నుండి ఇంట్లో అందరికీ అదే ఊత పదం ఓరి నీ దుంప తెగ! అనటం అలవాటు.వెనుకటి తరం వాళ్ళు ఎలా మాట్లాడినా సరే కానీ విక్రాంత్ చదువుకుని విదేశాలలో వైద్య వృత్తిలో ఉండి కూడా అలాగే అంటూ ఉంటాడు.స్వంత ఊరికి వచ్చినప్పుడు అందరి గురించి యోగ క్షేమాలు అడుగి తెలుసుకుంటూ పక్కనే కూర్చుని మధ్యమధ్యలో ఓరి నీ దుంప తెగ! అంటూ తన కన్నా చిన్నవాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే వింటూ అప్పుడప్పుడు వీపు మీదో,తొడ మీదో ఒక్కొక్క చరుపు చరుస్తూ హ్హ హ్హ హ్హా అంటూ పెద్దగా నవ్వుతూ ఉంటాడు.


Sunday, 3 January 2016

ఉదయం నిద్రలేవగానే.......

                                                                     ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేర స్థానం చూచినట్లవుతుంది.దీనివలన ధనాదాయం పెరుగుతుంది.పడకపై నుండి దిగగానే తూర్పు వైపుకు నడవాలి.ఇలా చేయడం వలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తయి మంచి లాభాలు పొందుతారు.            

నీ బొంద - దీర్ఘాయుష్మాన్ భవ

                                                        ఆర్యేష్ పదేళ్ళ వాగుడుకాయ.వాడికి ఎవరన్నాభయం,భక్తి లేవు.పెద్దా చిన్నా లేకుండా మాట్లాడేస్తుంటాడు.ఎవరిని పడితే వాళ్ళను ఏది పడితే అది అనకూడదురా!అని పదే పదే చెప్పినా అర్ధం కాదు.అల్లరి ఎక్కువై చదువులో వెనకబడ్డాడని సాయంత్రం ఇంటికి వచ్చి చదువు చెప్పేలాగా ఒక మాస్టారును పెట్టారు.ఆయన ఉండేది ఒక రెండు గంటలు.ఒక గంటన్నర ఆర్యేష్ ఏదో ఒకటి అది ఏమిటి సార్?ఇదేంటి సార్?అంటూ కాలక్షేపం చేసేస్తుంటాడు.ఆర్యేష్ వాళ్ళ నాన్న అయ్యప్ప మాల వేసుకుంటూ ఆర్యేష్ కి కూడా వేయించాడు.ఒక రోజు 
అలవాటులో పొరపాటుగా మాస్టారుతో మాట్లాడుతూ మాస్టారుని కూడా నీ బొంద అనేశాడు.మాస్టారు ఖంగు తిని అయ్యప్ప మాల వేసుకున్నావు కనుక కోపం వచ్చి ఇప్పుడు నీకు తొడపాశం పెట్టాలనిపించినా ఏమీ అనటం లేదు అన్నాడు.చేసేదేమీ లేక ఇకముందు నిన్ను అదుపులో పెట్టాల్సిందే అంటూ మాస్టారు వెళ్తుంటే మాస్టారుకు వచ్చిన కోపం తగ్గించడానికి ఆర్యేష్ సాక్షాత్తు అయ్యప్ప స్వామి దీవించినట్లుగా పోజు పెట్టి దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు.

Saturday, 2 January 2016

సంపద పెరగాలంటే........

                                                                    సంపద పెరగాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా ఒక చిన్నఫౌంటెన్  ఇంట్లో పెట్టుకోవాలి.నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది.వాటర్ ఫౌంటెన్ లాగా డబ్బును,సంపదను ఆకర్షించే శక్తి మరి దేనికీ లేదు.ఇంట్లో ఎక్కడ అయినా పెట్టుకోవచ్చు.అందంతో పాటు సంపద కూడా పెరుగుతుంది. 

Friday, 1 January 2016

ఆదాయాన్ని మించి ఖర్చు ఉంటే....

                                                            ఆదాయాన్ని మించి ఖర్చు ఎక్కువగా ఉంటే మొక్కను కానీ విత్తనాలు కానీ బాత్రూమ్ లో ఉంచాలి.మొక్క బాత్ రూమ్ లోని గాలిని శుద్ధి చేయటంతో పాటు అధిక ఖర్చును అరికడుతుంది. ఎదిగే మొక్కలైనా,విత్తనాలైనా నీటి శక్తిని పీల్చుకుని తిరిగి రీసైకిల్ చేస్తుంటాయి కనుక ఇవి డబ్బు వృధా కావడాన్ని అడ్డుకుంటాయి.