Tuesday 25 February 2014

గాదె క్రింద పందికొక్కులు

       సూర్జిత్ కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్ళిఅక్కడ సంపాదించిన డబ్బుతో మాతృదేశంలో ఒకసంస్థను ఏర్పాటు చేశాడు.అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశ్యంతో విదేశాలనుండి మిషన్లు పంపించి మరీ సంస్థను
నడుపుతున్నాడు.నమ్మకమయినవాడనుకుని ఒకతన్నిపెట్టాడు.అతను తనకు నమ్మకమయిన వాళ్ళను
తీసుకొచ్చి అందరూ కలిసి గాదె క్రింద పందికొక్కుల్లా అక్రమంగా తినేయటం మొదలుపెట్టారు.సూర్జిత్
 సంవత్సరానికి ఒకసారో రెండుసార్లో వచ్చినప్పుడు పైపై మెరుగులుచేసి సంస్దకు అందంగా రంగులువేసి బాగా నడుస్తున్నట్లు చూపించేవాడు.ఉద్యోగుల్ని సమస్యలు చెప్పనీయకుండా ,నేరుగా మాట్లాడనీయకుండా
మీటింగులు ఏర్పాటు చేసేవాడు.సూర్జిత్ తిరిగి విదేశాలకు వెళ్ళిన తర్వాత యధా రాజా తధా ప్రజా
అన్నట్లు వుండేది.పాపం సూర్జిత్ కి ఇవన్నీ తెలియవు.నిజంగానే సంస్థ బాగా నడుస్తుంది అనుకునేవాడు.

No comments:

Post a Comment