Friday 10 April 2015

తాపత్రయం

                                              కామక్షమ్మగారికి ఎనభై సంవత్సరాలు.పనివాళ్ళ మీద అజమాయిషీ చేస్తూ అన్ని పనులు తనే దగ్గరుండి చేయిస్తుంటుంది.ఈమె ధాటికి తట్టుకోలేక పనివాళ్ళందరూ పారిపోతున్నారు.ఇంట్లోవాళ్ళు సరయిన పనివాళ్ళు దొరక్క లబోదిబో అంటున్నారు.ఇంటి ఆవరణలో ఒక మునగ చెట్టు,రెండుమామిడి చెట్లు, బయట ఒక మామిడి చెట్టు కాయలు విరగ కాసినాయి.ఈమధ్య కామక్షమ్మగారికి సుస్తీ చేసింది.పెద్దగాతిరగటంలేదు. కామాక్షమ్మగారి దగ్గర ఒక మనిషిని పెట్టి ఇంట్లో అందరూ ఒక పదిరోజులు ఊరు వెళ్లారు.ఈమె లోపల ఉంటే ఎవరో ఒకరు అందినంతవరకు కాయలన్నీ కోసుకెళ్ళటం మొదలు పెట్టారు.ఈ విషయం పనిమనిషి కామక్షమ్మగారి చెవిని వేసింది.అయ్యో!కాయలన్నీనన్నుఅడగకుండా దొంగతనంగా కోసుకెళ్ళటం ఏమిటి?ఎంతో కష్టపడి చెట్లను పెంచాను.నావాళ్ళు తినాలి లేదా నేనిస్తే తీసుకోవాలి కానీ అని హంగామా చేసి ఎక్కడో దూరాన ఉన్న మనవరాలికి ఫోను చేసి ములక్కాడల పచ్చడి, మామిడికాయ పచ్చడి పట్టాలి.రెండు రోజుల్లో నువ్వే వస్తావో?మనిషిని పంపించి కాయలు తీసుకెళ్తావో?నాకు తెలియదు.వెంటనే రావాల్సిందేనని పట్టు పట్టేసరికి మనుమరాలు అమ్మమ్మకు కోపం వస్తుందని మనిషిని తీసుకుని వచ్చింది.కాయలన్నీ కోయించి తలా నాలుగు ఇచ్చిమిగతావి తను సర్దుకుంది.అమ్మమ్మా! ఇంకా నీకెందుకు ఈ తాపత్రయం? ప్రశాంతంగా ఉండు అని ఆమె  నొచ్చుకోకుండా చెప్పింది.  
   

No comments:

Post a Comment