Wednesday 16 September 2015

మోదక్

బియ్యప్పిండి - కప్పు 
కొబ్బరి తురుము  - కప్పు 
బెల్లం తురుము - 3/4 కప్పు
 పంచదార - 1/4 కప్పు 
నెయ్యి - 2  స్పూనులు  
యాలకుల పొడి - 1/2 స్పూను 
ఉప్పు - చిటికెడు 
నీళ్ళు - 1 కప్పు 
                                                 ఒక గిన్నెలో  నీళ్ళు,ఉప్పు,1 స్పూను నెయ్యి వేసి స్టవ్ పై పెట్టాలి.నీళ్ళు మరుగుతున్నప్పుడు బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకుని దగ్గరకొచ్చాక దింపేయాలి.మరో గిన్నెలో బెల్లం,పంచదార,కొబ్బరి తురుము కలిపి పొయ్యి మీద పెట్టాలి.దగ్గర పడుతుండగా యాలకుల పొడి వేసి దింపేయాలి. మోదక్ తయారీకి అచ్చులు దొరుకుతాయి.ఒకదాన్ని తీసుకుని లోపలి వైపు నెయ్యి రాసుకుని బియ్యప్పిండి మిశ్రమం తీసుకుని అచ్చులోపెట్టి మధ్యలో కొబ్బరి మిశ్రమం పెట్టి అచ్చును మూసేయాలి.ఇలా తయారు చేసుకున్నమోదక్ లను ఆవిరిపై 10 ని.లు ఉడికించాలి.అంతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదక్ తయారైనట్లే.
గమనిక :ఇదే విధంగా ఒక కప్పు వేయించిన తెల్ల నువ్వుల. పొడి ఒకకప్పు బెల్లం తురుము ఒక కప్పు వేసి  తయారుచేసుకోవచ్చు. .

No comments:

Post a Comment