Monday 30 June 2014

ద్రాక్ష జ్యూస్

             పండ్ల రసం -1 లీటరు
             పంచదార - 2 కే.జిలు
            నీళ్ళు -1 లీటరు
         నిమ్మ ఉప్పు లేక  సిట్రిక్ యాసిడ్ - 30గ్రా .(6 టీ స్పూన్లు)
           టోనోవిన్ ఎస్సెన్స్ - 4 టీస్పూన్లు
           సోడియం బెంజాఎట్  -1 టీస్పూన్
               పండ్లను కడిగి 5 నుండి 10 ని.లు ఉడికించాలి.ఉడికించిన పండ్లను రసం తీయాలి.గింజలు వేరుచేయాలి.
 పంచదారను కరిగించాలి.పాకం వడకట్టి చల్లారిన తర్వాత పండ్ల రసమును కలిపి నిమ్మ ఉప్పు ,టోనోవిన్ ఎస్సెన్స్ సోడియం బెంజాఎట్ ని కలిపి  పొడిసీసాలలో నింపుకోవాలి.
 గమనిక:ద్రాక్షపండ్లు సీజన్ లో ఇలా చేసి పెట్టుకొంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది.1 లీటర్ జ్యూస్ కి 5 లీటర్లు అవుతుంది.1 గ్లాస్ కి 3 గ్లాసులు చల్లటి నీళ్ళు కలిపి త్రాగాలి.

No comments:

Post a Comment