Wednesday 5 November 2014

ఆరోగ్యకరమైన అలవాటు

                                     ప్రతిరోజూ ఏదైనా తాజా పండ్లు,కూరగాయలతో జ్యూస్ చేసుకుని త్రాగటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఏ రసం తీసుకుంటే ఏ ఉపయోగం ఉంటుందో తెలుసుకుందాము.

బత్తాయి రసం:దీన్నిరోజూ త్రాగటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

యాపిల్ రసం:శరీరంలోని చెడు కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది.గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.
 
బొప్పాయి రసం:చర్మానికి ఎంతో మంచిది.అజీర్ణ సమస్యలు తలెత్తవు.గాయాలు మానడానికి కూడా ఉపయోగపడుతుంది.

నిమ్మరసం:నిమ్మరసం రోజూ తీసుకుంటే ఊబకాయం సమస్య ఉండదు.నీరసం తగ్గుతుంది.

ద్రాక్ష రసం:రక్తపోటు అదుపులో ఉంచుతుంది.కొవ్వుని తగ్గిస్తుంది.గుండెకు మేలు చేస్తుంది.
   
ఉసిరికాయ రసం:విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.రక్తాన్ని శుద్ధిచేస్తుంది.రక్తంలో చక్కర స్థాయిని క్రమబద్దీకరిస్తుంది.వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

టొమాటో రసం:గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.ఈరసానికి చిటికెడు మిరియాలపొడి చేరిస్తే రుచిగా ఉంటుంది.

కారట్ రసం:కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది.బరువు తగ్గిస్తుంది.కంటి చూపును మెరుగుపరుస్తుంది. అల్సర్లు,కాన్సర్లు రాకుండా కాపాడుతుంది.

దానిమ్మ రసం:యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన కాన్సర్ రాకుండా కాపాడుతుంది.









No comments:

Post a Comment