Friday 23 October 2015

ముఖంపై ముడతలు రాకుండా......

                                                                             వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు రావటం సహజం.కానీ ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలావరకు ముఖంపై ముడతలు త్వరగా రాకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు.ఒక గుప్పెడు మెంతి ఆకుల్ని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేయాలి.దీన్ని రాత్రి పడుకొనే ముందు ముఖానికి పట్టించి ఉదయం లేవగానే గోరువెచ్చటి నీళ్ళతో కడగాలి.అప్పుడు ముఖం మృదువుగా మారి ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.ఇలా తరచుగా చేస్తుంటే చక్కటి ఫలితం ఉంటుంది.మెంతి కూర ప్రత్యేకంగా ఏమి తెచ్చుకుంటాములే!అనుకోకుండా రెండు కుండీల్లో  మట్టిపోసి పైపైన కదిలించి మెంతులు చల్లితే చక్కగా మొక్కలు వస్తాయి.ఒక దాంట్లో మొక్కలు అయిపోయేటప్పటికి రెండో దానిలో మొక్కలు వచ్చేలా చల్లుకుంటే కాలంతో సంబంధం లేకుండా అన్ని రోజులు మెంతి కూర వాడుకోవచ్చు. 

No comments:

Post a Comment