Monday 8 June 2015

చిరుధాన్యాలతో ఇడ్లీ

మినపగుళ్ళు లేక పప్పు - 1 కప్పు
చిరుధాన్యాల రవ్వ - 2 కప్పులు
ఉప్పు - సరిపడా
                                              మినపగుళ్ళు కానీ పప్పు కానీ శుభ్రంగా కడిగి 5 గం.లు నానబెట్టాలి.తర్వాత మళ్ళీ 
ఒకసారి కడిగి సరిపడా ఉప్పువేసి మెత్తగా ఇడ్లీ పిండికన్నాకొద్దిగాపలుచగా రుబ్బాలి.ఈలోగా చిరుధన్యాల  రవ్వ అంటే రాగులు,సజ్జలు,జొన్నలు,ఉప్పుడు బియ్యంతో తయారుచేసిన రవ్వ కొత్తగా మార్కెట్లోదొరుకుతుంది.దీన్నిశుభ్రంగా కడిగి ఒక్క పది ని.లు నాననిచ్చి బాగా పిండి మినపపిండిలో కలుపుకోవాలి.ఇలా తయారుచేసిన పిండిని 10 -12 గం.లు బయటపెడితే పిండి పొంగి ఇడ్లీ మెత్తగా వస్తాయి.ఇడ్లీప్లేట్లకు పలుచగా నెయ్యిరాసి పిండిని పెట్టి ఇడ్లీ కుక్కర్ లో 10 ని.లు ఇడ్లీ మాదిరిగానే వండాలి.ఏ పచ్చడితోనయినా తినవచ్చు.పండుమిరపకాయ పచ్చడిలో పెరుగు కలిపినా చాలా రుచిగా ఉంటుంది.చిరుధన్యాలరవ్వతో చేసినవి తినటం వలన బరువు పెరగకుండా ఉంటారు.త్వరగా ఆకలి అనిపించదు. 

No comments:

Post a Comment