Thursday 2 August 2018

చర్మానికి తేమ

                                                              కాలం మారిందంటే చాలు వాతావరణంలో మార్పుల వల్ల చర్మంలో తేమ శాతం తగ్గి చర్మం పొడిబారుతుంది.ముందస్తు ప్రభావం ముఖం,మెడ చర్మంపై పడుతుంది.దీన్ని అధిగమించాలంటే ఒక చెంచా నారింజ తొక్కల పొడి,ఒక 1/2 చెంచా తేనె,ఒక అర చెంచా ఓట్స్ పొడి వేసి ఒకసారి కలిపి మళ్ళీ దానికి సరిపడా నీళ్ళు పోసి పూత వేయడానికి వీలుగా అంటే పలుచన,మరీ ముద్దలా కాకుండా కలుపుకోవాలి.దీన్నిముఖానికి,మెడకు పూత వేసి ఒక 15 ని.ల తర్వాత కడగాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మానికి తేమ అంది చర్మం నిగనిగలాడుతుంది.

No comments:

Post a Comment