Sunday 23 December 2018

మాటిమాటికి నొప్పులా?

                                                            కొంతమందిని మాటిమాటికీ కాళ్ళ నొప్పులు,మెడనొప్పి,ఒళ్ళు నొప్పులు ఏదో ఒకటి వేధిస్తుంటాయి.నలభై దాటిన మహిళల్లో,సరైన ఆహారం తీసుకోని వాళ్ళల్లో కాల్షియం లోపం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి.ఇటువంటప్పుడు ఒకసారి కాల్షియం పరీక్ష చేయించుకుని వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.కాల్షియం సరిపడా ఉంటే ఎముకలు,దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.కండరాల పనితీరు మెరుగుపడుతుంది.ఎన్నో ఉపయోగాలున్న కాల్షియం పుష్కలంగా లభించే ఆహారం రోజువారీ వీలైనంత ఎక్కువగా ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది.మునగ కాయలు పాలకూర,తోటకూర,గోంగూర,మునగాకు,చేమఆకు,పొన్నగంటి వంటి ఆకుకూరలు,క్యాబేజ్,ముల్లంగి,కాలీఫ్లవర్,సోయాబీన్స్,సెనగలు,పెసలు,రాజ్మ,బాదం,ఖర్జూరం,ఎండుద్రాక్ష,నువ్వులు,అవిసెలు,క్వినోవా,అంజీర్,చేపలు,గుడ్లు,పాలు,నువ్వులలడ్డు,తాటి బెల్లం వంటి వాటిల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.కాల్షియం తగ్గితే ఎముకలు బోలుగా తయారై ఊరికే విరిగిపోయే ప్రమాదం ఉంది.కనుక కాల్షియం మందు రూపంలో వేసుకునేకన్నా ఆహారం రూపంలో తీసుకోవడం ఉత్తమం.

No comments:

Post a Comment