Sunday 21 February 2021

నా మాటే శాసనం

                                                                           డెబ్భై సంవత్సరాల రవీంద్ర గారు అంత నాకే తెలుసు అనుకుంటారు.నా మాటే శాసనం అందరూ నా మాటే వినాలి అనుకుంటారు .దీనికి తోడు భార్య ఒక నెరజాణ.జ్ఞాని  అనబడే అజ్ఞాని.ఆమె చెప్పిందే వేదం అంటారు రవీంద్రగారు.భర్తను గుప్పెట్లో పెట్టుకుని ఆమెకు ఎవరిపై కోపం ఉంటే వాళ్ళను పోట్లాడమని తను రోట్లో రోటి పచ్చడి చెయ్యడం అలవాటు.వయసు పెరిగినా ఆమెలో ఆ చెడ్డ గుణం పోలేదు. పెద్దవాళ్ళనే  గౌరవంతో ఫోను చేసి మరీ తిట్టినా ఎవరూ ఎదురు చెప్పరు.పెద్దవాళ్ళను ఏమీ అనకూడదు కనుక ఎదురుగా ఏమీ అనలేక  తర్వాత చాటున అందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటారు.అది వేరే విషయం.కాలం మారింది మనకు తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత అని అర్ధం చేసుకోవడం లేదు.పెద్దవాళ్ళుగా మంచి సలహాలు ఇవ్వడం ఎవరికైనా బాగానే ఉంటుంది.ఒక్క రవీంద్ర గారే కాదు పెద్దవారు ఎవరైనా  ప్రతి విషయంలో తలదూర్చి నా మాటే శాసనం అందరూ నా మాటే వినాలి అని అనుకోకూడదు.ఎవరికి వారికి వాళ్ళకు కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలూ ఉంటాయి కదా!అందువలన పెద్దలు కూడా ఈ తరం వాళ్ళను అతిగా విసిగించి ఉన్న విలువ పోగొట్టుకోవటం కన్నా అడిగిన వాళ్ళకు సలహాలు ఇచ్చి ఆధ్యాత్మికంగా ఎదిగితే చివరి దశలో ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు.అప్పుడు అందరూ మనస్పూర్తిగా ఇష్టపడతారు.లేకపోతే వీళ్ళ గోల ఏమిటో?వీళ్ళు ఎప్పుడుపైకి పోతారురా బాబూ? అని కొంతమంది ఎదురు చూస్తుంటారు.కనుక ఈరోజుల్లో పెద్దలే కాదు ఎవరైనా వారి పరిధిలో వారు ఉండడం మంచిది.

No comments:

Post a Comment