Sunday 11 July 2021

వర్షాకాలంలో ఆరోగ్యంగా

                                                                         వర్షాకాలంలో రోజుకి ఒకసారైనా ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంటుంది.వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడిగా కాఫీనో,టీనో త్రాగాలని అనిపిస్తుంది. వాటికి ప్రత్యామ్నాయంగా కారట్,మునగాకు,టమోట,పాలకూర,క్యాబేజ్ సూపులు, ఆకులు, పువ్వులు,పొడులతో రకరకాల కషాయాలు తీసుకోవచ్చు.రకరకాల రుచులు,సువాసనలతో మనసుకు ఆహ్లాదంతోపాటు శరీరానికి ఆరోగ్యాన్ని అందచేస్తాయి.వేడి నీటిలో మన వంట ఇంటిలో దొరికే జీరా,దాల్చిన చెక్క,ధనియాలు,వాము,సోంపు వేయించి చేసిన పొడులు,శొంఠీ పొడి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చిటికెడు పొడి నుండి  1/4 చెంచా వరకు వేసి 2 ని.ల తర్వాత త్రాగాలి.ఇవే కాక మన పెరటిలో దొరికే కొత్తిమీర,పుదీనా,కరివేపాకు,తమలపాకు,వాము ఆకు కూడా కప్పు వేడి నీటికి 5,6 ఆకులు చొప్పున వేసుకుని వేడిగా త్రాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.తాజాగా మందార,శంఖు పువ్వులు,చామంతి,బిళ్ళ గన్నేరు,మునగ పువ్వుల టీ కూడా తీసుకుంటున్నారు.కొంచెం,కొంచెం అల్లం తురుము,వెల్లుల్లి తురుము కూడా నీటిలో వేసి వేరు వేరుగా మరిగించి ఎవరికి నచ్చిన విధంగా వారు తీసుకుంటున్నారు.పాలతో చేసిన కాఫీ,టీ బదులు వీటిలో ఏది తీసుకున్నా బరువు పెరగకుండా ఉండడంతో పాటు వ్యాధి  నిరోధక శక్తి  పెరిగి  ఆరోగ్యంగా ఉంటాము.                                                     

2 comments: