Friday 27 October 2017

చలికాలంలో చర్మం

                                                   చలి మొదలవగానే చాలామందికి చర్మం పొడిబారి పోతుంటుంది.చలికాలంలో కూడా చర్మం మృదువుగా ఉండాలంటే రోజుకి మూడు లీటర్ల నీళ్ళు తప్పనిసరిగా తాగాలి.ఏడెనిమిది గంటలు నిద్ర తప్పనిసరి.స్నానానికి పది ని.లు ముందు కొబ్బరి నూనెతో మర్దన చేసి గోరు వెచ్చటి నీటిలో ఒక చెక్క నిమ్మరసం పిండి ఆ నీటితో  స్నానం చేస్తే తాజాగా బాగుంటుంది.రోజూ యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి.ఈ కాలంలో సహజంగా వచ్చే ఒళ్ళు నొప్పుల సమస్య బాధించదు.ధ్యానం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.వారానికి రెండు సార్లు ఒక స్పూను తాజా పెరుగు,తేనె,బాదంపొడి లేదా శనగపిండి కలిపి ముఖానికి,కాళ్ళకు,చేతులకు రాసుకుని 15 ని.ల తర్వాత కడిగేయాలి.సమయం ఉంటే కనీసం వారానికి ఒకసారైనా శరీరం మొత్తానికి ఈ మిశ్రమం రాసుకుని స్నానం చేస్తే చర్మం  మృదువుగా మెరుస్తూ ఉంటుంది.రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.రోజూ రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు బాదం నూనె రాసుకుంటే పొడిబారకుండా మృదువుగా ఉంటాయి.ఇవన్నీ పాటిస్తూ ఈ కాలంలో దొరికే అన్నిరకాల పండ్లు,కూరగాయలు తాజాగా తీసుకుంటుంటే చలికాలంలో చర్మం పొడిబారే సమస్యను అధిగమించవచ్చు.

No comments:

Post a Comment