Wednesday 27 November 2019

పనికో ప్రణాళిక

                                                                  ముందు పని వెనుక,వెనుక పని ముందు చేసుకోకుండా మన దినచర్య మొదలుకాక ముందే ఆరోజు ఏమేమి పనులు చేయాలో తాపీగా ఆలోచించుకుని పనికో ప్రణాళిక పెట్టుకుంటే ఏ సమస్యలు రాకుండా ఉంటాయి.ఎంత కష్టపడినా కానీ పనులు తరగనప్పుడు ఒత్తిడికి గురి కాకుండా రెండు గంటలకోసారి ఒక పావుగంట విశ్రాంతి తీసుకుంటే పనిలో పొరపాట్లు దొర్లకుండా ప్రశాంతంగా పనులు పూర్తిచేయవచ్చు.ఈ విశ్రాంతి సమయంలో సంగీతం వింటూ ఒక పండు తింటూ పచ్చటి ప్రకృతిని చూస్తూ ఉంటే ఒత్తిడి మాయమై మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది.దీనితో చకచకా పనులు పూర్తి అవుతాయి.

No comments:

Post a Comment