Wednesday 27 November 2019

వేళకు ఓ పండు

                                                               మనలో చాలామంది మహిళలు ఉదయం,సాయంత్రం  పని హడావిడిలో  అల్పాహారం తీసుకోకుండా అశ్రద్ద చేసి ఒక కప్పు కాఫీ లేదా టీ తాగేసి ఒకేసారి భోజనం చేద్దాంలే అనుకుంటారు.అలా చేయడం వలన క్రమేపీ మనకు తెలియకుండానే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.కనుక అటువంటి సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే ఉదయం,సాయంత్రం తగిన సమయం లేకపోతే అల్పాహారం బదులు ఒక అరటి పండు,యాపిల్,జామ,బొప్పాయి,అనాస ముక్కలు లేదా వేళకు ఏదో ఒక పండు అందుబాటులో వున్నవి తిన్నా సరిపోతుంది.శరీరానికి తగిన పోషకాలు అందుతాయి.అలాగే ఒక కప్పు పాలు తాగితే ఎముకలు కూడా ధృడంగా తయారౌతాయి.పని ఒత్తిడిగా అనిపించినప్పుడుఒక పావుగంట ఎండలో కూర్చుంటే ఒత్తిడి మటుమాయమౌతుంది.సాయంకాలం లేదా పని మధ్యలో ఆకలిగా  అనిపించినప్పుడు ఏ పకోడీలో,బజ్జీలో తినకుండా క్యారట్,కీరా ముక్కలు,దానిమ్మ,గుమ్మడి,పుచ్చ గింజలు,నానబెట్టిన బాదం,ఎండు ద్రాక్ష వంటివి తింటే పొట్ట నిండడంతోపాటు పోషకాలు అందుతాయి.దీనితో బరువు అదుపులో ఉండి అందంగా,ఆరోగ్యంగా,చర్మం కాంతులీనుతూ ఉన్న వయసు కన్నా తక్కువగా  కనిపిస్తారు.  

No comments:

Post a Comment