Tuesday 12 January 2021

నిండు కుండ

                                                 చరవాణిలో వార్తలు చూస్తున్న జయంతిని ఒక వార్త ఆకర్షించింది.  భూమి తన చుట్టూ తాను వేగంగా తిరగటం వలన 365 రోజుల కన్నా ఎక్కువ రోజులు పడుతుందని దీనితో రోజులో సమయం తగ్గడంతో రోజు త్వరగా గడిచిపోతుందని దీని గురించి ఆందోళన చెందుతూ ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందోనని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారట అన్న వార్త  జానకిని ఆకర్షించింది? ఒకప్పుడు స్కైల్యాబ్ భూమిపై పడి అందరూ చనిపోతారని  చెప్పడంతో  అందరూ భయపడి ఎలాగూ చనిపోతామని ఉన్నన్నాళ్ళు దర్జాగా బ్రతుకుదామని ఉన్న ఆస్తులు అమ్మేసుకుని మరీ జల్సాలు చేశారు.చివరికి అది సముద్రంలో పడడంతో హమ్మయ్య బ్రతికిపోయాం అని ఊపిరి పీల్చుకున్నా ఆస్తులు అన్నీ అమ్మేసుకోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు.అందుకే ఏ వార్త విన్నా అతిగా కంగారుపడి ఆందోళన చెందడం అనవసరం.ఎప్పుడో ఏదో జరుగుతుందని మనం ఇప్పటినుండే కంగారుపడి అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోవడం  కూడా అనవసరం.ప్రశాంతంగా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ మానసికస్థైర్యాన్ని,ధైర్యాన్ని ప్రసాదించాలని నిర్మలమైన మనసుతో భగవంతుని ప్రార్ధించడం ఉత్తమం.అందరూ బాగుండాలి.అందరితోపాటు మనము బాగుండాలి.ఏది ఎప్పుడు?ఎలా?జరగాలో అలాగే  జరుగుతుంది.ఆందోళన పడడం వలన ప్రయోజనం శూన్యం.కనుక సానుకూల దృక్పధం అలవరచుకుంటే జీవితం  నిండు కుండలా ఎప్పుడూ తొణకకుండా ఉంటుంది.                                            

2 comments:

  1. చాలా బాగుంది… నేను మీ బ్లాగును నిజంగా ఇష్టపడుతున్నాను…
    Telangana Districts News
    Latest Telugu News
    Latest Cinema Telugu News

    ReplyDelete
  2. ధన్యవాదాలు

    ReplyDelete