Wednesday 25 March 2015

కయ్యానికి కాలు దువ్వి

                                                      జితేంద్ర ప్రభుత్వోద్యోగంచేస్తూ ఇతర రాష్ట్రాలలో ఉండేవాడు.పిల్లలు పెద్ద వాళ్ళు
అయ్యారు కనుక వాళ్లకు పెళ్ళిళ్ళు చేద్దామనే ఉద్దేశ్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వంత ఊరికి వచ్చాడు.ఇన్ని రోజులనుండి తన వాళ్ళు,భార్య తరఫు వాళ్ళు కూడా వీళ్ళ ఆస్తులు చూస్తూ వాటి మీద ఆదాయం సరిగా లెక్కకట్టి  జితేంద్ర చేతికి ఇవ్వకుండా ఎవరికి అందినది వాళ్ళు తినేసేవాళ్ళు.జితేంద్ర వచ్చేసరికి మింగుడుపడక కాలికి వేస్తే వేలికి,వేలికి వేస్తే కాలికి ముడి వేస్తూ ఆస్తుల దగ్గరే కాక,ప్రతిచిన్నదానికి విసిగించడం మొదలుపెట్టారు.అయినా జితేంద్ర సహనంతో గొడవలు ఎందుకులే అని సర్దుకుపోతున్నాడు.అందరికీ ఒకవైపు కాకపోతే ఒకవైపు వాళ్ళైనా మంచి వాళ్ళుంటారు.మనకుఏంటో రెండువైపులవాళ్ళు పెద్ద తలనొప్పిగా తయారయ్యారుఅని భార్యాభర్తలు అనుకొంటుంటారు.దీనికి తోడు ఈమధ్య కొత్తగా వీళ్ళమీద వాళ్లకు,వాళ్ళమీద వీళ్ళకు జితేంద్ర అన్నాడని చెప్పి వాళ్ళమానాన వాళ్ళు ఉంటుంటే చూడలేక కయ్యానికి కాలుదువ్వి జితేంద్రను రెచ్చగొడుతున్నారు.స్వలాభం కోసం జనం ఇలా తయారయ్యరేమిటో? పోయేటప్పుడు ఎవరూ ఏమీ తీసుకెళ్ళలేరు .ఈమాత్రానికి ఎదుటివాళ్ళ సొమ్ము కోసం ఇంత తాపత్రయం దేనికో?ఇన్నిరోజులు స్వంత ఊరిలో ఉండకపోవటం వల్ల తియ్యగా కబుర్లు చెప్పేవాళ్ళు.ఇప్పుడు ఒక్కొక్కళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది.ఉపేక్షించి లాభం లేదు డబ్బు కన్నా విలువైన బంధాల గురించి వీళ్ళకు తెలియ చెప్పాల్సిందే అనుకున్నాడు జితేంద్ర.      

No comments:

Post a Comment