Friday 19 August 2016

పుణ్య స్త్రీ గా

                                                      కృష్ణ వేణి రమణమ్మ గారింట్లో చిన్నప్పటి నుండి పనిచేసేది.తమ్ముడు అంటే ఉన్న పిచ్చి ప్రేమతో తన ఇద్దరు కూతుళ్ళలో పెద్ద అమ్మాయి సునందను పదిహేను ఏళ్ళకే పాతికేళ్ళవాడికి ఇచ్చి కట్టబెట్టింది.దానికితోడు పిల్లలు పుట్టలేదు.అదీ ఒకందుకు మంచిదే అనుకోవాలి.వాడు వ్యసనాల బారినపడి పక్కా తాగుబోతు,తిరుగుబోతుగా తయారయ్యాడు.వ్యసనపరులకు వచ్చినట్లే వాడికీ హెచ్ ఐ వి వచ్చింది.వాడి వల్ల భార్యకు వచ్చింది.అసలే సునంద అభిమానవతి.వ్యాధి వచ్చిందని తెలిసినప్పటి నుండి తలెత్తుకోలేని పరిస్థితి.ఎవరి ముఖము చూడటానికి కూడా ఇష్టపడలేదు.కనీసం పుట్టింటి ముఖం కూడా చూడలేదు.సునంద భర్తని ఆసుపత్రిలో చేర్చారు.వైద్యులు చివరిదశ అని చెప్పగానే కనీసం పుణ్య స్త్రీ గా నయినా చనిపోవాలని ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చి ఉత్తరం వ్రాసి ఉరి వేసుకుని చనిపోయింది.నిండా మూడు పదులన్నా నిండకుండానే తనువు చాలించింది. అయ్యో!ఎవరు చెప్పినా వినకుండా కృష్ణవేణి చదువుకుంటున్న చిన్న పిల్లకు పెళ్ళి చేసి సునంద జీవితం నాశనం చేసిందని రమణమ్మ గారు,చుట్టుపక్కల వాళ్ళే కాక బంధువులు అందరు గొడవ చేశారు.ఇప్పుడు ఎంత మంది అనుకున్నా ప్రయోజనం ఏముంది?చనిపోయిన సునంద ఆత్మ శాంతించాలని అనుకోవటం తప్ప. 
                                                        

No comments:

Post a Comment