Friday 2 September 2016

ఎముకలు గట్టిగా

                                                                   వయసుతో నిమిత్తం లేకుండా నడుం నొప్పులు,మోకాళ్ళ నొప్పులు నిత్యం మనం వింటూనే ఉంటాము.ఇవే కాకుండా వంగి పాదాలు రుద్దుకుంటుంటే చిటుక్కున పట్టేయడం,ఎక్కువ సేపు మెడ వంచి పనిచేస్తే మెడ నొప్పి,బలంగా ఏమైనా తోస్తే వీపు నొప్పి,ఎక్కడో ఒకచోట పట్టేయడం జరుగుతుంది.అదేమంటే వెన్నెముక బలహీనంగా తయారై పూసలు నొక్కుకోవడమో,ఊడిపోవడమో,డిస్క్ పక్కకు తొలగటమో జరిగిందని బెల్టు వేసుకోవడమో లేక శస్త్ర చికిత్స వరకు వెళ్ళటమో జరుగుతుంది.వీటన్నిటికీ కారణం ఎముకలు వెన్నెముక బలహీనంగా తయారవడమే.ఇంతకు ముందు రోజుల్లో నడుము,కాళ్ళ నొప్పులతో ఒకరో,ఇద్దరో బాధ పడేవాళ్ళు.ఇప్పుడు నూటికి ఎనభై మంది ఏదోఒక నొప్పితో బాధ పడుతున్నారు.దీనికి పరిష్కారం ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు తినడమే.నువ్వులు,బాదం పప్పులు,పాలు,గుమ్మడి గింజలు,సబ్జా గింజలు,పాలకూర,రాగులు,కొర్రలు,సజ్జలు,యవలు,జొన్నలు వంటి తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.ముందుగా ఒక 15 రోజులు క్రమం తప్పకుండా ఉదయం అల్పాహరంతో పాటు ఒక కప్పు వేడిపాలలో ఒక టేబుల్ స్పూను నువ్వులు,ఒక 1/2 టేబుల్ స్పూను గుమ్మడి గింజలు పొడిచేసి,2 స్పూనులు తేనె కలిపి తాగితే ఎముకలు బలంగా తయారవుతాయి.వ్యాయామం చేసేటప్పుడు ఎవరికి వారు చేయగలిగినంత వరకు మాత్రమే చేయాలి.బలవంతాన చేతులు,కాళ్ళు,నడుము వంచి చెయ్యకూడదు.లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

No comments:

Post a Comment