Thursday 15 September 2016

మనసులో మాట

                                                                          ఈరోజుల్లో చాలా మంది మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నారు.చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా ఉంటున్నారు.ఈ విధంగా ఉంటే ఎదుటి వాళ్ళకు మనపట్ల ఉన్న గౌరవం తగ్గిపోతుంది.కనుక చెప్పేది చేసేది కూడా ఒకటే ఉండాలి.అలా చేయలేని వాళ్ళు నిశ్శబ్దంగా  ఉండటం మంచిది.ఇంకొంతమంది పైకి ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడతారు.లోపల అంతా కుళ్ళు,కుతంత్రాలు.ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులో కూడా ఉంటేనే మాట్లాడాలి.అంతే కానీ నటించకూడదు.ఇంకొంత మంది ఎవరి మీదైనా కోపం వస్తే ఎదుటివారిది తప్పా?మనది తప్పా?అని విశ్లేషించుకోకుండా మనసులో పెట్టుకుని ఏదో కక్ష సాధిస్తున్నట్లు కనిపించినప్పుడల్లా సతాయిస్తూ ఉంటారు.కోపం వస్తే ఆ కొద్దిసేపు మాటలోనే కానీ మనసులో పెట్టుకోకూడదు.జీవితం ఎంతో విలువైనది.పిచ్చిపిచ్చి అపోహలతో జీవితాన్ని వృధా చేసుకోకూడదు.సుఖ సంతోషాలతో ఉండాలంటే మనసులో ఏదీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి.


No comments:

Post a Comment