Saturday 22 October 2016

నిద్ర లేవగానే ....

                                                                   నిద్ర లేవగానే దంతధావనంతోపాటు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం వల్ల కాస్తోకూస్తో ఉన్న బద్ధకం వదిలిపోతుంది.కాసేపు ధ్యానం,ఇష్టమైతే పూజ,ప్రకృతిని చూస్తూ లేత సూర్య కిరణాలూ తగిలేలా నడవడం లేదా కూర్చుని ఇష్టమైన పుస్తకం చదవడం,మనసుకు నచ్చిన వారితో మాట్లాడటం వంటివి ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తుంటే మనసు ప్రశాంతంగా ఉండి రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.బాధ్యతలు ఉన్నవాళ్ళు ఒక అరగంట ముందు లేచి పై విధంగా చేస్తుంటే ఒత్తిడి లేకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు.  

No comments:

Post a Comment