Tuesday 25 September 2018

తగిన శాస్తి

                                                                 ఉత్తరప్రదేశ్ లో రైతులు అధికారులు లంచం అడిగినందుకు ఒక మూటలో చాలా పాములను పట్టుకొచ్చి కార్యాలయంలో లంచం అడిగిన అధికారుల గదిలో వదిలి పెట్టి తలుపు గడియ పెట్టారట.అప్పుడు అధికారులు భయంతో బిక్కు బిక్కు మంటూ ఇప్పుడే కాదు జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరినీ లంచం అడగము.దయచేసి తలుపులు తీయండి అని వేడుకున్నారట.లంచం అడిగి ఇచ్చేవరకు పనిచేయకుండా కార్యాలయాల చుట్టూ తిప్పి జలగల మాదిరి ప్రజలను పీడించుకుని తినే అధికారులకు రైతులు తగిన శాస్తి చేసి బుద్ది వచ్చేలా చేశారు.మన పని అయిపోవడం ముఖ్యం అని ఎవరికి వాళ్ళు చూసి చూడనట్లు అడిగినంత సమర్పించుకుని అప్పుల పాలై ఇబ్బంది పడినంత కాలం లంచ గొండులు పుట్టగొడుగుల మాదిరిగా తయారవుతూనే ఉంటారు.ఒక్కళ్ళు ఎదిరించినా అతనికే నష్టం.ఉపయోగం ఉండదు.అందరూ కలిసి సమిష్టిగా చేసినప్పుడే ఏ పనైనా సాధ్యపడుతుంది.రైతులందరూ సమిష్టిగా ఎదిరించడం వల్లే అధికారులకు వాళ్ళ తప్పు తెలిసి వచ్చింది.

No comments:

Post a Comment