Sunday 30 September 2018

నిత్య కళ్యాణి

                                                                కొంచెం నీళ్ళు పోస్తే చాలు ఎక్కడైనా ఇట్టే పెరిగి నిండుగా పువ్వులు పూస్తుంది.పద్మాల్లా అందంగా నిండుగా ఏడాది పొడుగునా రంగు రంగుల పువ్వులు పూసే అందమైన బిళ్ళ గన్నేరు మొక్కే నిత్యకల్యాణి.ఈ పువ్వులు పూజకు పనికిరావని ఒకప్పుడు అంత శ్రద్దగా పెంచేవాళ్ళు కాదు.తాజాగా ఈ మొక్క మొత్తంలో ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసి ప్రత్యేకంగా పెంచుతున్నారు.ఆకులు,కాండంలో ఉండే రసాయనాలు క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర వహిస్తున్నాయి.ఆకుల్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడిచేసి రోజూ ఒక గ్లాసు నీళ్ళల్లో కొద్దిగా వేసి సగం అయ్యే వరకు మరిగించి తాగితే అధిక రక్తపీడనం అదుపులో ఉంటుంది.పరగడుపున నాలుగు ఆకుల్ని నమిలినా,నీళ్ళల్లో మరిగించి తాగినా మధుమేహం అదుపులో ఉంటుంది.ఆకులు నూరి పసుపు కలిపి గాయాలకు పూస్తే త్వరగా తగ్గుతాయి. వైద్యంలో ఆకులు,పువ్వులు మాత్రమే వాడాలి.వేళ్ళు,కాండం వాడాలంటే నిపుణుల సలహాతో  తీసుకోవాలి.ఏది ఏమైనా నిత్య కల్యాణి అందానికి అందంతోపాటు వైద్యానికి కూడా ఎంతో ఉపయోగకరం.

No comments:

Post a Comment