Wednesday 17 October 2018

శతాబ్దపు సూపరు పండు

                                                     ఒకప్పుడు కొండల్లో,గుట్టల్లో పెరిగి కాయలు కాసి రోడ్డు పక్క బుట్టల్లో మాత్రమే కనిపించే ఆకుపచ్చని కొండ ఫలం అంటే సీతాఫలం నేడు ఎన్నో వర్ణాల్లో సూపర్ మార్కెట్లలో కనువిందు చేస్తుంది.వేసవిలో మామిడి పండు కోసం ఎదురు చూచినట్లు శీతాకాలంలో సీతాఫలం కోసం ఎదురు చూచేవాళ్ళు నాలాగా ఎంతోమంది ఉన్నారు.సీతాఫలం రుచితోపాటు ఔషధ గుణాలు కలిగి ఉండడంతో ఒత్తిడి,ఆందోళన మాయమవటమే కాక వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.రామా,లక్ష్మణ,హనుమాన్ ఫలాల్లో గుజ్జుతోపాటు కాన్సర్ ని నివారించే ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడంతో వీటిని ఇప్పుడిప్పుడు తినటానికి అలవాటు పడుతున్నారు.ఇవి మార్కెట్లో అందుబాటులో ఉండవు  కనుక పెరటిలోనే మొక్కలు తెచ్చి  పెంచుకుంటున్నారు.ఏది ఏమైనా సీతాఫలం రుచి అమోఘం.అందుకే ఈ శతాబ్దపు సూపరు పండుగా ఎంపిక అయింది.దీనితో రైతులు దానిమ్మ,బొప్పాయి,జామ తోటలు సాగు చేసినట్లే సీతాఫలాలు కూడా రకరాల రంగుల్లో పండిస్తున్నారు.   

No comments:

Post a Comment