Friday 5 April 2019

సంతోషాల సంవత్సరాది

                                                                              వసంత రుతువులో కొత్త చిగుళ్ళతో చైత్ర మాసంలో శుక్ల పక్షంలో శుద్ధ పాడ్యమి రోజు వచ్చేదే తెలుగు వారి సంవత్సరాది.మావి చిగుర్లు తిన్న కోయిల కుహు కుహులతో సమ్మోహనంగా ఆహ్వానం పలగ్గానే ఉరుకులు పరుగులుతో సంతోషాలను మోసుకొచ్చేదే ఉగాది.అభ్యంగన స్నానానంతరం దేవతార్చనతో శ్రీవికారి నామ సంవత్సరాన్ని స్వాగతించి షడ్రుచుల ఉగాది పచ్చడి నివేదించాలి.గుమ్మాలకు మామిడి తోరణాలు,కొత్త బట్టలు,పిండి వంటలు సరే సరి.మనం తలపెట్టిన కార్యక్రమాలకు శుభ ఫలితాలు కలగాలని కోరుకుని ఉగాది పచ్చడి స్వీకరించాలి.వేప పూవుతో చేసిన ఈ పచ్చడి తినడం వలన సర్వారిష్టాలు తొలుగుతాయి.ముఖ్యంగా కష్టం సుఖం అనే తేడా లేకుండా అన్నీ సమ దృష్టితో చూడాలన్నదే సంకేతం.పంచాంగ శ్రవణం వింటూ బంధు మిత్రులతో రాశి ఫలాలు చర్చిస్తూ సరదాగా సంతోషంగా గడిపేయాలి.సంవత్సరాది నాడు ఎంత సంతోషంగా గడిపితే అంత సంతోషంగా మళ్ళీ సంవత్సరాది వచ్చే వరకు జీవితం హాయిగా సాగిపోతుందని పెద్దల ఉవాచ.అంతే కాదు అది అందరి నమ్మకం. 

No comments:

Post a Comment