Wednesday 1 May 2019

నామ్మా!డబ్బాలు పట్టుకెళ్ళు

                                                        ద్వివేద్ ఆరు సంవత్సరాల అల్లరి పిడుగు.దీనికి తోడు కబుర్ల పుట్ట.అమ్మానాన్నలు విదేశాలలో ఉండడంతో ద్వివేద్ కొన్ని రోజులు నానమ్మ తాతయ్యల వద్ద పెరిగాడు.దీనితో వాడికి వాళ్ళంటే చాలాచాలా ఇష్టం.ద్వివేద్ నానమ్మను నామ్మా!అని పిలిచేవాడు.ద్వివేద్ కి తమ్ముడు పుట్టడంతో ఇద్దరి మనవళ్ళతో కోడలికి కష్టం అని నానమ్మ ద్వివేద్ ని చూచుకోవడానికి వెళ్ళింది.కొన్ని నెలల తర్వాత  నానమ్మ తిరుగు ప్రయాణం అవుతుంటే ద్వివేద్ నామ్మా!నువ్వు వెళ్లొద్దు ఇక్కడే ఉండిపో అని ఒకటే ఏడుపు.ఏడవకు నాన్నా!మనకు మన ఊరిలో పొలాలు,ఇళ్ళు ఉన్నాయి కదా!అక్కడ తాతయ్యకు కూడా ఇబ్బంది. అందుకే మళ్ళీ పనులు చూచుకుని తాతయ్య,నేను వస్తాము అని చెప్పింది.అప్పుడు ద్వివేద్ కళ్ళు తుడుచుకుని నామ్మా!నేను పెద్దపెద్ద డబ్బాలు ఇస్తాను.వాటిని పట్టుకెళ్ళి పొలాలు,ఇళ్ళు వాటిల్లో పెట్టుకుని ఇక్కడకు తీసుకుని రా!ఇక్కడే అందరం ఉండిపోవచ్చు అన్నాడు.ఒక్క క్షణం నోట మాట రాక నానమ్మ వాడి మద్దుముద్దు మాటలకు నవ్వుకుంటూ పొలాలు,ఇళ్ళు డబ్బాల్లో తేవడానికి కుదరదు నాన్నా!వాటిని అక్కడే జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పింది.అలాగయితే పనులు అయిపోగానే త్వరగా వచ్చేయండి నామ్మా!మీకోసం ఎదురుచూస్తాను అని సంతోషంగా వీడ్కోలు చెప్పాడు.

No comments:

Post a Comment