Monday 6 May 2019

వేసంగి నేస్తం

                                                                   వేసవి వచ్చిందంటే ఏమి తిన్నా తినకపోయినా చల్లటి మంచినీళ్ళు ఉంటే చాలు అనిపిస్తుంది.ఇంటికి వచ్చిన అతిధులకు రాగానే చల్లటి మంచి నీళ్ళు ఇస్తే ఎంతో సంతోషపడతారు.కుండ నీరు అయితే మరీ సంతోషం.ఇంతకీ వేసంగి నేస్తం ఏమిటంటే మంచి నీటి మట్టి కుండ.కుండలో ఒక రాగి పాత్ర కూడా  వేస్తే నీళ్ళు శుభ్రం అవుతాయి.వేసవిలో ఈ  నీరు త్రాగడం ఉత్తమం.దప్పిగొన్నవారికి గుక్కెడు నీళ్ళు ఇస్తే అన్ని బాధలు తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెబుతున్నాయి.వీలయితే పక్షులకు,జంతువులకు కూడా వేసవిలో తాగడానికి మట్టి పాత్రల్లో నీళ్ళు పెట్టడం ఎంతో మంచిది.ఇప్పుడు చాలామంది వెనుకటి రోజుల్లో మాదిరిగా మట్టి పాత్రలో వండి వడ్డించడానికి,వాటిల్లో తినడానికి ఇష్టపడుతున్నారు.మట్టి కుండలో నీరు,మట్టి పాత్రలో వండిన పదార్ధాలు రుచితో పాటు ఆరోగ్యదాయకం.వీలయితే ప్రయత్నించండి. 

No comments:

Post a Comment