Thursday 10 April 2014

శ్రేష్టుడు

ధనవంతుని కంటే బంధువు శ్రేష్టుడు.బంధువు కన్నా వయస్సులో పెద్ద అయినవాడు శ్రేష్టుడు.వయోధికుని కంటే
క్రియావంతుడు ఉత్తముడు.క్రియావంతుని కంటే కూడా విద్యావంతుడు మిక్కిలి శ్రేష్టుడు.కనుక విద్యావంతుడు
 అందరి కన్నా శ్రేష్టుడు.
                 పాముపడగమీద ఎంతో విలువైన మణి ఉంటుంది.అయినా విషజంతువు కనుక మనం దానిని చూచి
దూరంగా తొలగిపోతాము.అలాగే ఎంతటి విద్య ఉన్నాదుర్జనుడైతే త్యజించవలసిందే.ఆవిద్యవల్ల ఉపయోగంలేదు.
విద్యావంతుడు "విద్యావంతుణ్ణి" అని చెప్పుకోవటంతోనే విజ్ఞానాన్ని కోల్పోతాడు."విద్యయొసగును వినయమ్ము"
అని నానుడి.కానీ ఇప్పుడు వినయం మాట దేముడెరుగు అహంకారం ఎక్కువగా కనిపిస్తుంది.చిన్న,పెద్ద అని తేడా
లేకుండా చదువుకున్నామనే గర్వంతో ఏమాట పడితే ఆమాట ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అనే ఇంగితజ్ఞానం
లేకుండా మాట్లాడేస్తున్నారు.చదువుతోపాటు గర్వం పెరగకూడదు.అప్పుడు ఆచదువు వ్యర్దమవుతుంది.

No comments:

Post a Comment