Tuesday 22 April 2014

పరోపకారం

           చెట్లు పండ్లను ఇస్తున్నాయి.నదులు తియ్యటి నీళ్ళను ప్రవహిమ్పచేస్తున్నాయి.ఆవులు బలవర్ధకమైన పాలను ఇస్తున్నాయి.ఎవరూ అడగకుండానే ఇవన్నీ ఈపనులు ఎందుకు చేస్తున్నాయంటే పరులకు ఉపకారం
చేయడంకోసమే.కనుక ఈశరీరాన్ని  కూడా ఇతరులకు ఉపకారం చేయటం కోసమే వినియోగించాలి.
           హిమజ వాళ్ళ అమ్మమ్మ తను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని వైద్యకళాశాలకు డొనేట్ చేసింది.
ఎంతోమంది వైద్యవిద్యార్ధులకు ఎనాటమీ ప్రాక్టికల్స్ అప్పుడు ఉపయోగపడుతుందని తను బ్రతికుండగానే
వైద్యకళాశాల వాళ్ళను పిలిపించి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసింది.దహనం చేస్తే తప్ప ముక్తి కలుగదు అని
అనుకోకుండా భావితరాలకు ఉపయోగపడాలనే నిర్ణయం తీసుకున్నందుకు అందరూ ఆమెను అభినందించారు.

No comments:

Post a Comment