Wednesday 25 November 2015

వనభోజనాల సందడి

                                                             కార్తీకమాసం వచ్చిందంటే వనభోజనాల సందడే సందడి.ఈమాసంలో ఎంతో పవిత్రమన ఉసిరి చెట్టు కింద ఒక్క పూటయినా భోజనం చేయాలన్నది మన సంప్రదాయం.కార్తీక మాసంలో విష్ణుమూర్తి,లక్ష్మీదేవి ఇద్దరూ ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని పురాణం కధనం.అందుకే ఎవరికి వారు తోటలో ఉసిరి చెట్లు నాటి ఆచెట్ల కింద విందు భోజనాలు ఏర్పాటు చేయటం అనాదిగా వస్తున్నఆచారం.ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో కనీసం ఐదు ఉసిరి మొక్కలు నాటాలని పెద్దలు చెబుతుంటారు.సంవత్సరానికి ఒకసారి బంధుమిత్రులతో ఉదయం తోటకు వెళ్ళి సాయంత్రం వరకు పిల్లలు,పెద్దలు సరదాగా ఆటపాటలతో,కబుర్లతో ఆనందంగా గడపటం ఒక గొప్ప అనుభూతి.

No comments:

Post a Comment