Sunday 29 November 2015

రోజుకు రెండు చక్రాలు

                                                             అనాసపండు కొయ్యటం కష్టమని మనలో చాలామంది దాని జోలికి వెళ్ళం.కానీ దాన్ని తేలికగా కొయ్యటానికి ఇప్పుడు మార్కెట్ లో చాలా సాధనాలు వచ్చాయి.చక్కగా పక్వానికి వచ్చిన పండుని పై చెక్కు తీసి చక్రాలుగా కోసి రోజూ రెండు తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.ఇది ఎన్నోరకాల కాన్సర్లు రాకుండా కాపాడుతుంది.రక్తంలో గ్లూకోజు శాతాన్ని నియంత్రిస్తుంది.వయసుతో పాటు వచ్చే కంటి సమస్యల్ని నివారిస్తుంది.కొద్దిగా పుల్లపుల్లగా ఎంతో రుచిగా ఉండే ఈ పండుని ఇంట్లో అందరూ రోజూ రెండు చక్రాలు తినటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

No comments:

Post a Comment