Monday 30 November 2015

మౌనంగానే ఎదగమనీ ..........

                                                     భగవంతుడు మనకు నోరు ఇచ్చింది అతిగా తినడానికో,ఎదుటివారిని అతిగా విమర్శించడానికో కాదు.కఠినంగా,అతిగా మాట్లాడేవారంటే ఎవరికీ గౌరవం ఉండదు.సాధ్యమైనంతవరకూ మితంగా మాట్లాడుతూ హుందాగా ఉండటానికి ప్రయత్నించాలి.దీన్ని మించిన శక్తివంతమైన ఆయుధం మౌనం.మౌనాన్ని ధరించిన వ్యక్తిని ఎదుటివారి దుర్భాషలైనా,ఎంతటి బలవంతుడైనా ఏమీ చేయలేడు.కొంతమంది ఎదుటివాళ్ళకు ఏమీ తెలియదు మాకే అన్నీ తెలుసన్నట్లు  ఎదుటివారిని ఈసడించి మాట్లాడతారు.వ్యర్ధమైన మాటలతో జీవితాన్ని వృధా చేసుకోకుండా ఎవరి విధులు వారు నిర్వర్తించుతూనే పవిత్రమైన ధ్యానంతో,భగవంతుని నోరారా కీర్తించుతూ,సాటి మనిషి పట్ల గౌరవభావంతో ఉండాలి.                                     

No comments:

Post a Comment