Saturday 7 November 2015

ఆహారం వృధా కాకుండా ........

                                                      ఎవరికైనా భోజనం వడ్డించేటప్పుడు ఎక్కువ మొత్తంలో పెట్టి తినమని బలవంత పెట్టకూడదు.పాపం!ఎదుటివాళ్ళు మొహమాటానికో,పడేయకూడదనో తినలేక,పారేయలేక నానా ఇబ్బంది పడుతుంటారు."అన్నం పరబ్రహ్మ స్వరూపం"అని అన్నారు పెద్దలు.తక్కువ మొత్తంలో ముందు వడ్డించితే కావాలంటే మళ్ళీ వడ్డించవచ్చు.ముందుగానే ఎక్కువ పెట్టేస్తే తినలేక పారేసే అవకాశం ఉంది.అన్నం వృధాగా పడేయకూడదు.మనం ఏది పెడితే అదే తినాలి అనుకోకుండా పిల్లల విషయంలో కూడా వాళ్ళేమి తింటారో అడిగి అది చేసి పెడితే ఆహారాన్ని వృధా చేయరు.రోజూ కుటుంబసభ్యులు ఎంత తింటారో అంచనా వేసుకుని దానికి తగినట్లుగా వండితే ఆహారం వృధా కాకుండా ఉంటుంది.రోజు ఒకే పద్దతిలో వంట చేసేకన్నావివిధ రకాల పద్దతుల్లో చేస్తే అందరూ ఇష్టంగా వృధా చేయకుండా తింటారు. 

No comments:

Post a Comment