Thursday 21 January 2016

అరమీటరే ఎక్కువ

                                                                  మధుమతి,సావిత్రి పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవారు.సావిత్రి పెద్ద ఎచ్చులకోరు.ప్రతి దాంట్లో మీ అందరి కన్నా నేనే గొప్పఅని స్వంత డబ్బాకొట్టుకునేది.ఆఖరుకు తను వేసుకునే జాకెట్టు కూడా మీ అందరి వాటి కన్నాగొప్పదనేది.మీ అందరికీ ముప్పాతిక మీటరు పడితే నాకు అర మీటరే ఎక్కువ అని చెప్పేది.అది ఎలాగంటే అర మీటరు జాకెట్టు ముక్క తెచ్చుకుని గట్టిగా బిగదీసి వేసుకున్నట్లుగా తనే స్వయంగా కుట్టుకునేది.సావిత్రి కుటుంబం మొత్తం అనుకోకుండా స్వంత ఊరు వెళ్ళిపోయారు.ఒక పది సంవత్సరాల తర్వాత సావిత్రి మధుమతి ఇంటికి వచ్చింది.అప్పుడు మధుమతి కూతురు చిన్నది.ఆంటీ గుర్తున్నారా?అని అడిగితే ఎందుకు గుర్తుండరు?టైట్ జాకెట్ల ఆంటీ కదా!లొడలోడా మాట్లాడేవాళ్ళు ఎదుటివాళ్ళను కూరలో కరివేపాకు లాగా ఏరి పారేసేది అనేసింది,ఆ మాటలకు మదిమతి ముఖం.వెలా తెలా పోయింది.సావిత్రి ముఖం తెల్లగా పాలిపోయింది.

No comments:

Post a Comment