Tuesday 26 April 2016

ఎందుకీ సంపాదన?

                                                    శంకర శాస్త్రి గారికి ఎనమండుగురు సంతానం.అందులో నలుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు.వీళ్ళందరినీ పోషించడం కష్టమై పొట్ట చేతపట్టుకుని కుటుంబంతో సహా శంకర శాస్త్రి గారు వేరే రాష్ట్రం తరలి వెళ్లారు.వెళ్ళారన్న మాటే కానీ ఏపని చేసినా అందరి పోషణ కష్టమైపోయింది.పొరుగింటి రామయ్య తను పనిచేసే చోట గ్రానైట్ రాళ్ళు గ్రేడ్ చేసే విధానం నేర్చుకోమని తీసుకెళ్ళాడు.కొన్నాళ్ళకు తనే స్వంతంగా వ్యాపారం ప్రారంభించి తెలివితేటలతో గ్రానైట్ రాళ్ళు విదేశాలకు ఎగుమతి చేయటం మొదలుపెట్టారు.రాత్రి,పగలు కష్టపడి వ్యాపారాన్నివృద్ధి చేసి విపరీతంగా సంపాదించారు.ఈలోగా పిల్లలందరి పెళ్ళిళ్ళు చేశారు.శంకర శాస్త్రి గారు సంపాదనతో పాటు దానధర్మాలు కూడా విరివిగా చేయటంవల్ల ఆయన అందరికీ సుపరిచితం.పెద్ద వయసు రావటంతో ఆయన విశ్రాంతి తీసుకుందామనుకునే సమయంలో పిల్లలు ఆస్తులకోసం గొడవలు పడి కోర్టుకు వెళ్ళే స్థాయికి ఎదిగారు.తండ్రి రేయనక,పగలనక కష్టపడి వృద్దిచేసిన వ్యాపారాన్నినిలబెట్టాలనే జ్ఞానం లేని పిల్లల తగువులు చూసి ఆయన హృదయం తల్లడిల్లిపోయింది.తిండి తినీ,తినక కష్టపడి సంపాదించింది కష్టం విలువ,అనుబంధాల విలువ తెలియని వీళ్ళకోసమా?ఎందుకీ సంపాదన?అని శంకర శాస్త్రిగారు విరక్తిగా ఎందుకు సంపాదించానా?అని చివరి దశలోమనశ్శాంతి లేక బాధపడుతున్నారు.

No comments:

Post a Comment