Wednesday 8 January 2014

తృణ ధాన్యాలు-ఆరోగ్యం

తృణ ధాన్యాలు అంటే రాగులు,జొన్నలు,సజ్జలు,యవ్వలు,కొర్రలు,సామలు.ఒకప్పుడు ఈచిరుధాన్యాలతో చేసిన
పదార్ధాలు ఎక్కువగా తినేవాళ్ళు కనుక ఆరోగ్యంగా ఉండేవారు.ఇప్పుడు తెల్లబియ్యం,ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటంవలన స్థూలకాయము,మధుమేహం,గుండెజబ్బులు,రక్తపోటుఒకటనేముంది?ఎన్నోరకాలజబ్బులతో
ఇబ్బంది పడుతున్నారు.అయినాప్రజలలో మార్పు రావటం లేదు.60ఏళ్లవాళ్ళు కూడా వీటితో తయారు చేసిన
పదార్థాలు తింటే మంచిదిఅని తెలిసికూడా తినటానికి ఇష్టపడటం లేదు.షణ్ముఖి ప్రజలలో వీటిపట్ల అవగాహన
కల్పించటం కోసం ప్రత్యేకించి ప్రదర్శన శాలలో చిరుధాన్యాల ఉత్పత్తులకు సంబంధించి ఒకవిక్రయశాల పెట్టింది.
ఇంతకుముందు ఇంట్లో తయారు చేసుకున్నవాళ్ళు మాత్రమే తినగలిగేవాళ్ళు.వింత ఏమిటంటే చిన్నవాళ్ళు
పెద్దవాళ్ళను అమ్మా,అత్తయ్యా ఇవితీసుకోండి అంటే మాకువద్దు అంటున్నారు.రాగిమాల్ట్,జొన్నరవ్వ,జొన్నపిండి,
జొన్ననూడిల్స్,జొన్నసేమ్యా,జొన్నపాస్తా,జొన్నబిస్కట్లు,4రకాలు,జొన్అటుకులు,మల్టిగ్రెయన్పిండిఎన్నోరకాలు
షణ్ముఖి తనస్టాలులో పెట్టింది.ఇలా పెట్టటంవలన తనకులాభం ఏమీవుండదు కానీకొంతమందికి అయినావీటిపట్ల
అవగాహన కలిగి వీటితో చేసిన ఆహారంతిని  ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆశ.తృణ ధాన్యాలతో చేసిన ఆహారం
తినండి.ఆరోగ్యంగా ఉండండి.

     

No comments:

Post a Comment